Sunday 9 September 2018

రామాయణము కిష్కిందకాండ -ఇరువదిఆరవసర్గ

                                  రామాయణము 

                                   కిష్కిందకాండ -ఇరువదిఆరవసర్గ 

వాలికి దాహంగా సంస్కారములు ముగిసిన పిమ్మట సుగ్రీవుడు ఒకచోట కూర్చుని బాధపడుచుండెను . తన అన్న ను తలచుకొని మిక్కిలి రోదించెను . అప్పుడు వానర ప్రముఖులందరూ సుగ్రీవుని వద్దకు వెళ్లి అతడిని ఓదార్చి ,శ్రీరాముని వద్దకు అతడిని తీసుకువెళ్ళేను . వారందరూ శ్రీరామునికి నమస్కారము చేసిరి . పిమ్మట  వాయునందనుడు శ్రీరామునితో "ఓ మహా వీరా !అనితర సాధ్యమయిన వాలి రాజ్యము నీ దయవలన సుగ్రీవుని కి దక్కినది . సుగ్రీవుడు నీ ఆజ్ఞకు బద్దుడు . అతడిని ఈ రాజ్యమునకు రాజుగా చేయుము . అతడు నిన్ను బాగుగా గౌరవించును . మాతో కిష్కింధకు రమ్ము . "అని పిలిచెను . 

అప్పుడు శ్రీరాముడు "హనుమా !నేను పదునాలుగు సంవత్సరముల కాలము గ్రామములో కానీ పట్టణములో కానీ ప్రవేశించరాదని మా ఆటీన్ద్రి ఆజ్ఞ . కావున మీరు వెళ్ళండి నేను ఇక్కడే ఈ ప్రసవం గిరిపై ఉంటాను ఇచ్చటి ప్రక్రుతి రామణీయముగా ఉండును . గాలులు చల్లగా ఉండును . "అని పలికి పిమ్మట సుగ్రీవునితో "సుగ్రీవా !నీవు కిష్కింధకు రాజువి కమ్ము . నీ అన్న వాలి కుమారుడైన అంగదుడు వీరుడు . సర్వ శ్రేష్ఠుడు . అతడిని యువరాజుగా ప్పట్టాభిషిక్తుడిని గావింపుము . వానలు వుండు నాలుగు మాసములను వార్షికములు అందురు . ఈ సమయములో సీతాన్వేషణ కష్టము . కావున మీరు సుఖముగా కిష్కిందలో వుండండి . వర్షాకాలం పూర్తి అయిన పిదప కార్తీకమాస ఆరంభములో సీతాన్వేషణ కు ,రావణ వద్దకు సైన్యమును సంసిద్దము చేయుము . "అని పలికెను . 
అప్పుడు సుగ్రీవుడు శ్రీరాముని ఆదేశము మేరకు కిష్కిందా నగరములో ప్రవేశించేను . నగరంలోని ప్రజలు ,వానర ప్రముఖులు అందరూ సుగ్రీవుని చుట్టుముట్టేను . వారందరితో కొద్దిసేపు కుశలప్రశ్నలు మొదలగు సంభాషణలు గావించి పిమ్మట సుగ్రీవుడు అంతఃపురమునకు వెళ్లి అటునుండి రాజ్యసభకు వెళ్లెను . వానరులు రాజ్యసభను రంగురంగుల పూలతో అలంకరించిరి . బంగారు సింహాసనంపై సుగ్రీవుని కూర్చొండబెట్టి ,పుణ్యతీర్ధములనుండి ,నదీనదముల నుండి ,సప్తసముద్రముల నుండి తెచ్చిన నీటిని బంగారు పాత్రలో ఉంచి వాటితో సుగ్రీవునికి పట్టాభిషేకము చేసెను . ఆ సమయములో బ్రాహ్మణోత్తములు అనేక యజ్ఞములు చేసిరి . వారందరికీ అమూల్యమైన నగలు ,వస్త్రములు ,దనము ,ధాన్యము ,గోవులు ,వస్తువులను ,మావోహారమైన ఆహార పదార్ధములను ఇచ్చి సంతోష పరిచేను . సుగ్రీవుడు తన భార్య రుమను శ్వీకరించెను . పిమ్మట శ్రీరాముని ఆదేశము మేరకు అంగదుని యువరాజుగా పట్టాభిషేకము చేసెను . అప్పుడు అచట వున్న వానర ప్రముఖులందరూ "బాగుబాగు "అని పొగిడిరి . పిమ్మర సుగ్రీవుడు శ్రీరాముని దగ్గరకు వెళ్లి పట్టాభిషేక విషయములన్నీ వివరించెను . 

రామాయణము కిష్కిందకాండ ఇరువది ఆరవసర్గ సమాప్తము . 

                              శశి ,

ఎం . ఏ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .