రామాయణము
అరణ్యకాండ -ఇరువదియేడవసర్గ
ఆ విధముగా రాక్షసులు హతమగుట చూసిన ఖరుడు తానె స్వయంగా రాముడిపై తలపడటానికి పూనుకొనెను . అది గమనించిన త్రిశరుడు (మూడు శిరములు కలవాడు )"ప్రభు !ఈ మానవుడితో మీరు తలపడుట అవమానకరం . నేను యుద్ధము చేసెదను . వాడిని ఈ రణరంగము సాక్షిగా నా వాడి శరములతో ముక్కలుముక్కలుగా చేసెదను "అని పలికి రణరంగం లోకి దూకేను .
అతడు రాముడు పై తన శరములతో వర్షము కురిపించెను . అవి రాముడి పాలభాగమున తగిలెను . శ్రీరాముడు క్రుద్ధుడై అతడి రధమును ధ్వంసము చేసి ,పిదప అతడి మూడు శిరములను కూల్చివేసెను . ఆ రాక్షసుడి మొండెము ఆ రణరంగమున నెత్తురోడుతూ పడిపోయెను . శ్రీరాముడి దాటికి రాక్షసులు పెక్కు మంది చనిపోయిరి . మిగిలిన కొద్దిగొప్ప మంది భయముతో రణరంగమునుండి దూరముగా పారిపోవుచున్నారు .
ఖరుడు వారిని వారించి ,ఉత్సాహపరచి రణరంగము వైపు మరల్చెను .
రామాయణము అరణ్యకాండ ఇరువదియేడవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .