రామాయణము
అరణ్యకాండ -ఇరువదిమూడవసర్గ
ఆ విధముగా భయంకరులు ,నరమాంస భక్షకులు ఐన 14,000 మంది రాక్షసులను వెంట బెట్టుకుని ఖరుడు ,అతని సోదరుడు దూషణుడు అరణ్యమార్గము గుండా శ్రీరాముని ఆశ్రమము వైపు సాగిరి . మార్గమున వారికి అనేక దుశ్శకునములు కనిపించెను . వినాశకాలే విపరీత బుద్ధి అన్న విధముగా వారు ఆ దుశ్శకునములు ఏ మాత్రము లెక్కింపక అత్యుత్సాహముతో ప్రగల్భములు పలుకుచు ముందుకు సాగిరి .
జరిగెడి వృత్తాంతము అంతయు దేవతలు మునులు ఆకాశము నుండి వీక్షించుచుంటిరి . ఆ విధముగా ఆ రాక్షస సేన యావత్తు శ్రీరాముని ఆశ్రమము వద్దకు వచ్చిరి .
రామాయణము అరణ్యకాండ ఇరువదిమూడవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment