Thursday 17 May 2018

రామాయణం కిష్కిందకాండ -ఇరువదిరెండవసర్గ

                                     రామాయణం 

                               కిష్కిందకాండ -ఇరువదిరెండవసర్గ 

కొనఊపిరితో వున్నా వాలి తన శక్తినంతా కూడగట్టుకుని కళ్లుతెరిచి చూచెను అతడికి ఎదురుగా సుగ్రీవుడు కనపడెను . అప్పుడా వానర ప్రభువు "తమ్ముడా !నేను బలగర్వితుడనై ,అజ్ఞానవసమున  భార్యను చెరపట్టితిని . నా దోషమును మన్నింపుము . అన్నదమ్ములమైన మనము కలిసి మెలిసి జీవించు అదృష్టము  దేవుడు మన నొసటన రాయలేదు . మరి కొన్ని క్షణములలో నేను ఈ తనువును చాలించెదను . కావున ఈ వానర రాజ్యమును నీవు శ్వీకరింపుము . ఈ సమస్త సంపదలు రాజ్యము తుదకు నా ప్రాణములు కూడా వదిలి వెళ్ళిపోచున్నాను . 'వాలి అజేయుడు ,ఎంతటి వీరుడికైనా లొంగడు 'అనే నా కీర్తి నేటితో పరిసమాప్తి అయినది . ఓ వీరుడా !రాజ్యభారం క్లిష్టమైనదే అయిననూ దానిని భరించ నీవు సమర్థుడవు . 
సోదరా !నా కుమారుడై అంగదుడు నాకు ప్రాణములకంటే ఎక్కువ ప్రియుడు . అతడు  పసివాడు అమాయకుడు . అతడి రక్షణ  భారము  ఇకపై నీదే . అతనికి నాకు మారుగా అన్నవస్త్రాభరణాదులను నీవే సమకూర్పవలెను . ఇతడికి ఎట్టి భయము లేకుండా అండగా ఉండుము . నాయనా !సుగ్రీవా !నా ధర్మపత్ని అగు తార సుషేణుని కూతురు , ఈమె ఏంటో సూక్ష్మ బుడ్డి కలది . రాబోవు ఆపదలను పసిగట్టగలడు . సకల విషయములనందును సమర్థురాలు . తమ్ముడా !శ్రీరాముని కార్యము ఎట్టి సంకోచము లేకుండా చేయుము . సుగ్రీవా !ఇదిగో !ఈ దివ్యమైన బంగారుమాలను నా బొందిలో ప్రాణము ఉండగానే నీవు దరింపుము లేనిచో నేను మృతి చెందిన వెంటనే ఈ మాలకున్న అజేయ శక్తి నశిస్తుంది . "అని పలికి తమ్ముడికి ఆ మాలను అందించెను . 

అన్న వాలి మాటలు విన్న సుగ్రీవునికి అతనిపై అంతకు ముందు వరకు వున్న శత్రు భావము పూర్తిగా నశించి అన్నపై ప్రేమ భాద అంకురించినవి . పిమ్మట వాలి తన కుమారుడైన అంగదుడను పిలిచి అతడికి అనేక బుద్దులు చెప్పెను. పిమ్మట వాలి మరణము ఆసన్నమగుటచే కన్నులు మూసివేసెను అతడి ప్రాణములు అనంతవాయువులలో కలిసిపోయెను . ఆ క్షణములో కిష్కింద నగరములో ఆక్రోసనాలు ఏడుపులు ఆకాశము అంటు నట్లుగా వినిపించెను . కిష్కిందా రాజ్యము కళావిహీనము అయ్యెను . తన పాటి మరణించిన  కారణముగా తార దుఃఖసముద్రములో మునిగిపోయెను . చచ్చిపడి ఉన్న భర్త ముఖము చూచి  కౌగలించుకుని నరికివేయబడ్డ చెట్టుని అల్లుకున్న తీగలా నేలపై పడిపోయెను . 

రామాయణము కిష్కింద కాండ ఇరువదిరెండవసర్గ సమాప్తము . 

                                  శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ ( తెలుగు ),తెలుగు పండితులు . 








రామాయణము కిష్కిందకాండ -ఇరువదిఒకటవసర్గ

                                           రామాయణము 

                                               కిష్కిందకాండ -ఇరువదిఒకటవసర్గ 

ఆకాశము నుండి రాలి పడిన తారక వలె భూమిపై పది ఏడ్చుచున్న తారను చూచి ఆంజినేయుడు ఇలా పలికెను . 
"ఓ మహాసాద్వీ !ఏ ప్రాణి అయినను తెలిసి చేసిన ,తెలియక చేసిన పాపపుణ్య ఫలితములన్నిటినీ ఈ లోకమునైనా ,పరలోకమునైనా తప్పక అనుభవించి తీరవలెను . ఈ శరీరము నీటి బుడగ వాలే అస్తిరమైనది ,కావున ఒక దేహమున వున్న జీవుడు మరొక దేహమున వున్నా జీవుడి గూర్చి విచారించుట అవివేకము . ఓ దేవీ !నీవు అన్నీ తెలిసిన దానవు . ఏ జీవి ఎప్పుడు పుట్టునో ఏ జీవి ఎప్పుడు గిట్టునో ఎవ్వరూ చెప్పలేరు . కావున ఈ విలాపములు మాని పరలోకమున వున్నత గతులిచ్చెడి పుణ్యకార్యములు చేయుము . 
తల్లీ అసంఖ్యాకులైన వానరభల్లూకములతో కూడిన సువిశాలమైన  కిష్కింద రాజ్యమును నీ భర్త అయినా వాలి ఏంటో సమర్ధవంతముగా పరిపాలించాడు . దీనులను ఆప్తులను చక్కగా రక్షించాడు ఒక వీరునితో యుద్ధము చేస్తూ వీరమరణము పొందుటకు సిద్ధముగా వున్నాడు . కావున అతనికి తప్పక ఉత్తమలోకములు లభిస్తాయి . ఆ విషయములో నీవు శోకించవలిసిన పనిలేదు . ఓ పూజ్యురాలా !ఈ వానరప్రముఖులందరికీ అంగదునికి ,ఈ కిష్కింద రాజ్యమునకు నీవే రక్షకురాలివి . వారందరూ సోకథంతప్తులై వున్నారు వారిని ఊరడించి భావికార్యమునకు ప్రోత్సహించుము . నీ పర్యవేక్షణలో అంగదుడు రాజ్యమును పరిపాలించగలడు . సింహాసనమును అధిష్టించిన అంగదుడిని చూచినచో నీ మనసుకు కొంత ఊరట లభించును . "అని పలికెను . 
అప్పుడా తార మారుతితో "ఓ వానర శ్రేష్టా !నీవు పలికినట్టు నా కుమారుడు వున్ననూ ఈ రాజ్యము నాకు ఉన్నానో వాటి మీద నాకు మనసు లేదు . నా మనసు నా పాటి పాదపద్మములనే ఆశ్రయించుకుని వున్నది . ఆయన లేను బతుకు నాకు వ్యర్థం . కావున నేను కూడా ఆయనతో సహగమనము చేసెదను . అంగదునికి సుగ్రీవుడు తండ్రి వంటి వాడు అతని బాగోగులు సుగ్రీవుడి చూసుకొనును . నేను నా భర్తతో సహగమనము చేసెదను "అని పలికెను . 

రామాయణము కిష్కిందకాండ ఇరువదిఒకటవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు  పండితులు .