రామాయణం
కిష్కిందకాండ -ఇరువదిరెండవసర్గ
కొనఊపిరితో వున్నా వాలి తన శక్తినంతా కూడగట్టుకుని కళ్లుతెరిచి చూచెను అతడికి ఎదురుగా సుగ్రీవుడు కనపడెను . అప్పుడా వానర ప్రభువు "తమ్ముడా !నేను బలగర్వితుడనై ,అజ్ఞానవసమున భార్యను చెరపట్టితిని . నా దోషమును మన్నింపుము . అన్నదమ్ములమైన మనము కలిసి మెలిసి జీవించు అదృష్టము దేవుడు మన నొసటన రాయలేదు . మరి కొన్ని క్షణములలో నేను ఈ తనువును చాలించెదను . కావున ఈ వానర రాజ్యమును నీవు శ్వీకరింపుము . ఈ సమస్త సంపదలు రాజ్యము తుదకు నా ప్రాణములు కూడా వదిలి వెళ్ళిపోచున్నాను . 'వాలి అజేయుడు ,ఎంతటి వీరుడికైనా లొంగడు 'అనే నా కీర్తి నేటితో పరిసమాప్తి అయినది . ఓ వీరుడా !రాజ్యభారం క్లిష్టమైనదే అయిననూ దానిని భరించ నీవు సమర్థుడవు .
సోదరా !నా కుమారుడై అంగదుడు నాకు ప్రాణములకంటే ఎక్కువ ప్రియుడు . అతడు పసివాడు అమాయకుడు . అతడి రక్షణ భారము ఇకపై నీదే . అతనికి నాకు మారుగా అన్నవస్త్రాభరణాదులను నీవే సమకూర్పవలెను . ఇతడికి ఎట్టి భయము లేకుండా అండగా ఉండుము . నాయనా !సుగ్రీవా !నా ధర్మపత్ని అగు తార సుషేణుని కూతురు , ఈమె ఏంటో సూక్ష్మ బుడ్డి కలది . రాబోవు ఆపదలను పసిగట్టగలడు . సకల విషయములనందును సమర్థురాలు . తమ్ముడా !శ్రీరాముని కార్యము ఎట్టి సంకోచము లేకుండా చేయుము . సుగ్రీవా !ఇదిగో !ఈ దివ్యమైన బంగారుమాలను నా బొందిలో ప్రాణము ఉండగానే నీవు దరింపుము లేనిచో నేను మృతి చెందిన వెంటనే ఈ మాలకున్న అజేయ శక్తి నశిస్తుంది . "అని పలికి తమ్ముడికి ఆ మాలను అందించెను .
అన్న వాలి మాటలు విన్న సుగ్రీవునికి అతనిపై అంతకు ముందు వరకు వున్న శత్రు భావము పూర్తిగా నశించి అన్నపై ప్రేమ భాద అంకురించినవి . పిమ్మట వాలి తన కుమారుడైన అంగదుడను పిలిచి అతడికి అనేక బుద్దులు చెప్పెను. పిమ్మట వాలి మరణము ఆసన్నమగుటచే కన్నులు మూసివేసెను అతడి ప్రాణములు అనంతవాయువులలో కలిసిపోయెను . ఆ క్షణములో కిష్కింద నగరములో ఆక్రోసనాలు ఏడుపులు ఆకాశము అంటు నట్లుగా వినిపించెను . కిష్కిందా రాజ్యము కళావిహీనము అయ్యెను . తన పాటి మరణించిన కారణముగా తార దుఃఖసముద్రములో మునిగిపోయెను . చచ్చిపడి ఉన్న భర్త ముఖము చూచి కౌగలించుకుని నరికివేయబడ్డ చెట్టుని అల్లుకున్న తీగలా నేలపై పడిపోయెను .
రామాయణము కిష్కింద కాండ ఇరువదిరెండవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ ( తెలుగు ),తెలుగు పండితులు .