రామాయణము
కిష్కిందకాండ -ఇరువదిఒకటవసర్గ
ఆకాశము నుండి రాలి పడిన తారక వలె భూమిపై పది ఏడ్చుచున్న తారను చూచి ఆంజినేయుడు ఇలా పలికెను .
"ఓ మహాసాద్వీ !ఏ ప్రాణి అయినను తెలిసి చేసిన ,తెలియక చేసిన పాపపుణ్య ఫలితములన్నిటినీ ఈ లోకమునైనా ,పరలోకమునైనా తప్పక అనుభవించి తీరవలెను . ఈ శరీరము నీటి బుడగ వాలే అస్తిరమైనది ,కావున ఒక దేహమున వున్న జీవుడు మరొక దేహమున వున్నా జీవుడి గూర్చి విచారించుట అవివేకము . ఓ దేవీ !నీవు అన్నీ తెలిసిన దానవు . ఏ జీవి ఎప్పుడు పుట్టునో ఏ జీవి ఎప్పుడు గిట్టునో ఎవ్వరూ చెప్పలేరు . కావున ఈ విలాపములు మాని పరలోకమున వున్నత గతులిచ్చెడి పుణ్యకార్యములు చేయుము .
తల్లీ అసంఖ్యాకులైన వానరభల్లూకములతో కూడిన సువిశాలమైన కిష్కింద రాజ్యమును నీ భర్త అయినా వాలి ఏంటో సమర్ధవంతముగా పరిపాలించాడు . దీనులను ఆప్తులను చక్కగా రక్షించాడు ఒక వీరునితో యుద్ధము చేస్తూ వీరమరణము పొందుటకు సిద్ధముగా వున్నాడు . కావున అతనికి తప్పక ఉత్తమలోకములు లభిస్తాయి . ఆ విషయములో నీవు శోకించవలిసిన పనిలేదు . ఓ పూజ్యురాలా !ఈ వానరప్రముఖులందరికీ అంగదునికి ,ఈ కిష్కింద రాజ్యమునకు నీవే రక్షకురాలివి . వారందరూ సోకథంతప్తులై వున్నారు వారిని ఊరడించి భావికార్యమునకు ప్రోత్సహించుము . నీ పర్యవేక్షణలో అంగదుడు రాజ్యమును పరిపాలించగలడు . సింహాసనమును అధిష్టించిన అంగదుడిని చూచినచో నీ మనసుకు కొంత ఊరట లభించును . "అని పలికెను .
అప్పుడా తార మారుతితో "ఓ వానర శ్రేష్టా !నీవు పలికినట్టు నా కుమారుడు వున్ననూ ఈ రాజ్యము నాకు ఉన్నానో వాటి మీద నాకు మనసు లేదు . నా మనసు నా పాటి పాదపద్మములనే ఆశ్రయించుకుని వున్నది . ఆయన లేను బతుకు నాకు వ్యర్థం . కావున నేను కూడా ఆయనతో సహగమనము చేసెదను . అంగదునికి సుగ్రీవుడు తండ్రి వంటి వాడు అతని బాగోగులు సుగ్రీవుడి చూసుకొనును . నేను నా భర్తతో సహగమనము చేసెదను "అని పలికెను .
తల్లీ అసంఖ్యాకులైన వానరభల్లూకములతో కూడిన సువిశాలమైన కిష్కింద రాజ్యమును నీ భర్త అయినా వాలి ఏంటో సమర్ధవంతముగా పరిపాలించాడు . దీనులను ఆప్తులను చక్కగా రక్షించాడు ఒక వీరునితో యుద్ధము చేస్తూ వీరమరణము పొందుటకు సిద్ధముగా వున్నాడు . కావున అతనికి తప్పక ఉత్తమలోకములు లభిస్తాయి . ఆ విషయములో నీవు శోకించవలిసిన పనిలేదు . ఓ పూజ్యురాలా !ఈ వానరప్రముఖులందరికీ అంగదునికి ,ఈ కిష్కింద రాజ్యమునకు నీవే రక్షకురాలివి . వారందరూ సోకథంతప్తులై వున్నారు వారిని ఊరడించి భావికార్యమునకు ప్రోత్సహించుము . నీ పర్యవేక్షణలో అంగదుడు రాజ్యమును పరిపాలించగలడు . సింహాసనమును అధిష్టించిన అంగదుడిని చూచినచో నీ మనసుకు కొంత ఊరట లభించును . "అని పలికెను .
అప్పుడా తార మారుతితో "ఓ వానర శ్రేష్టా !నీవు పలికినట్టు నా కుమారుడు వున్ననూ ఈ రాజ్యము నాకు ఉన్నానో వాటి మీద నాకు మనసు లేదు . నా మనసు నా పాటి పాదపద్మములనే ఆశ్రయించుకుని వున్నది . ఆయన లేను బతుకు నాకు వ్యర్థం . కావున నేను కూడా ఆయనతో సహగమనము చేసెదను . అంగదునికి సుగ్రీవుడు తండ్రి వంటి వాడు అతని బాగోగులు సుగ్రీవుడి చూసుకొనును . నేను నా భర్తతో సహగమనము చేసెదను "అని పలికెను .
రామాయణము కిష్కిందకాండ ఇరువదిఒకటవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment