రామాయణము
యుద్ధకాండ -తొంబదియేడవసర్గ
రాక్షసరాజైన రావణుని దాటికి వానరులు తట్టుకొనలేకపోయిరి . కకావికలమవుతున్న వానరసేనను చూసిన సుగ్రీవుడు వానర యుద్ధ శిబిరములకు సుషేణుడిని కాపలా ఉంచి,తానె స్వయముగా యుద్ధమునకు దిగెను . సుగ్రీవుడు యుద్ధమునకు దిగుట చూసిన విరూపాక్షుడు అను రాక్షసుడు కూడా యుద్ధ రంగములో సుగ్రీవుని ఎదిరించి నిలబడెను . వారిరువురి మధ్య భయంకరమైన యుద్ధము జరిగినది . ఆ యుద్దములో విరూపాక్షుడు సుగ్రీవుడి చేతిలో మట్టి కరిచేను . అది చూసిన రాక్షస సేన భయముతో గగ్గోలు పెట్టినవి . వానరసేన సంతోషముతో జయజయద్వానములు చేసినవి .
రామాయణము యుద్ధకాండ తొంబదియేడవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment