Thursday, 4 May 2017

రామాయణము అరణ్యకాండ -ఇరువది అయిదవసర్గ

                                           రామాయణము 

                                             అరణ్యకాండ -ఇరువది అయిదవసర్గ 

ఖరుడు తన ముందు భాగమున నడుచుచున్న యోధులతో కూడి ,ఆశ్రమమునకు చేరి ,శత్రుసంహార సమర్థుడై ,రాణావేశములో ధనుర్ధారియై యున్న శ్రీరాముని చూసిరి . అప్పుడు ఖరుడు విల్లంబులు చేతబూని ,ధనుష్టంకారము చేయుచు ,రాముడు దగ్గరగా వచ్చిరి . భయంకరులైన రాక్షసులు శ్రీరాముని చుట్టుముట్టిరి . వారందరూ వాడి అయిన బాణములు ,శూలములు ,ఖడ్గములు శ్రీరామునిపైకి విసిరిరి . శ్రీరాముడు ఏమాత్రము తొణకక ,వందలకొలది వాడి అయిన బాణములు రాక్షసులపైకి ప్రయోగించెను . 
ఆ బాణములు తగిలి అనేక మంది రాక్షసులు మరణించిరి . మిగిలిన రాక్షసులు ప్రాణ భయముతో ఖరుని శరణు జొచ్చుటకై అతని వద్దకు పరుగిడిరి . అప్పుడు దూషణుడు వారిని వెంట బెట్టుకుని తిరిగి రణరంగమునకు వచ్చిరి . తిరిగి శ్రీరాముని చుట్టుముట్టిరి . ఆ రాక్షస యోధులందరూ చెట్లు ,బండరాళ్లు ,పెద్దపెద్ద కర్రలు రామునిపైకి విసరసాగిరి . రాముడు ప్రభావితమైన గంధర్వ బాణమును వారిపై ప్రయోగించెను . 
రాముడు బాణము తీయుట కానీ ,బాణము సంధించుట కానీ రాక్షస గణమునకు కనిపించుటలేదు . కేవలము వారి శరీరమునకు తగిలి నపుడే తెలియుచున్నది . పరంపరగా వచ్చుచున్న బాణములు రాముడి ముఖము నుండే వచ్చుచున్నావా అన్నట్లు వున్నవి . ఆ రణభూమి అంతయు రాక్షసుల కళేబరములతో ,రక్త మాంసములతో నిండిపోయెను . ఆ విధముగా ఆ రణరంగము భయంకరముగా కానవచ్చుచున్నది . 

రామాయణము అరణ్యకాండ ఇరువది అయిదవసర్గ సమాప్తము . 

                              శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment