రామాయణము
అరణ్యకాండ -ఇరువదిఆరవసర్గ
అప్పుడు దూషణుడు తన సైన్యము రాముని చేతిలో హతులగుట గమనించి ,ధీరులైన 5000 మంది రాక్షస యోధులను యుద్ధమునకు పిలిచేను . వారందరూ రాముని చేతిలో అతి స్వల్ప కాలములోనే హతులయ్యిరి . చూసిన దూషణుడు శ్రీరాముడిపైకి దూకేను . అట్టి దూషణుడి ని చూసి శ్రీరాముడు అతని రధమును ,ధనుస్సుని ముక్కలు చేసెను . అయినను మీదకు ఉరుకుతున్న దూషణుడిని తన నిశిత శరములతో పరిమార్చెను .
రాక్షస వీరుడగు దూషణుడు మరణించుట చూసిన మిగిలిన రాక్షసులు మిక్కిలి క్రుద్ధులై శ్రీరామునిపైకి దూకిరి . శ్రీరాముడు వారందరిని అవలీలగా పరిమార్చెను . ఆ విధముగా వేలకొలది రాక్షసుల కళేబరములతో ,రక్త మాంసములతో ఆ రానా రంగము నిండిపోయెను . అప్పుడు అచట శ్రీరాముడు ,ఖరుడు ,త్రిశిరరాక్షసుడు మాత్రమే మిగిలిరి .
రామాయణము అరణ్యకాండ ఇరువదిఆరవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment