Saturday, 6 May 2017

రామాయణము అరణ్యకాండ -ఇరువదిఆరవసర్గ

                                           రామాయణము 

                                             అరణ్యకాండ -ఇరువదిఆరవసర్గ 

అప్పుడు దూషణుడు తన సైన్యము రాముని చేతిలో హతులగుట గమనించి ,ధీరులైన 5000 మంది రాక్షస యోధులను యుద్ధమునకు పిలిచేను . వారందరూ రాముని చేతిలో అతి స్వల్ప కాలములోనే హతులయ్యిరి .  చూసిన దూషణుడు శ్రీరాముడిపైకి దూకేను . అట్టి దూషణుడి ని చూసి శ్రీరాముడు అతని రధమును ,ధనుస్సుని ముక్కలు చేసెను . అయినను మీదకు ఉరుకుతున్న దూషణుడిని  తన నిశిత శరములతో పరిమార్చెను . 
రాక్షస వీరుడగు దూషణుడు మరణించుట చూసిన మిగిలిన రాక్షసులు మిక్కిలి క్రుద్ధులై శ్రీరామునిపైకి దూకిరి . శ్రీరాముడు వారందరిని అవలీలగా పరిమార్చెను . ఆ విధముగా వేలకొలది రాక్షసుల కళేబరములతో ,రక్త మాంసములతో ఆ రానా రంగము నిండిపోయెను . అప్పుడు అచట శ్రీరాముడు ,ఖరుడు ,త్రిశిరరాక్షసుడు మాత్రమే మిగిలిరి . 

రామాయణము అరణ్యకాండ ఇరువదిఆరవసర్గ సమాప్తము . 

                             శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





No comments:

Post a Comment