రామాయణము
కిష్కిందకాండ -పందొమ్మిదవసర్గ
ఆ విధముగా శ్రీరాముని దెబ్బకు వాలి పడిపోయాడని తెలిసిన తార అంతఃపురము నుండి పరుగు పరుగున వచ్చుచుండెను . ఆమెకు దారిలో అనేక వానర వీరులు వాలి కూలిపోవడంతో బయపడి పారిపోతూ కనిపించారు . ఆమె వారి ఆపి "ఓ వానర వీరులారా !రాజ్యము కోసము సుగ్రీవుడు పన్నిన పన్నాగము ఇది . అతడు శ్రీరాముని చేత తన అన్నపై బాణము వేయించెను . కావున మీరు భయపడనవసరము లేదు "అని పలికెను . అప్పుడా వానరవీరులు "అమ్మా !వాలి మరణావస్థలో వున్ననూ నీ కుమారుడు ఇంకనూ బతికే వున్నాడు ఇప్పుడు రాజ్యమును రక్షించుకొనుట తక్షణ కర్తవ్యము . ఇప్పటికే ఈ రాజ్యమునుండి వాలి చే బహిష్కరించబడిన వానరుల నుండి ముప్పు వున్నది సుగ్రీవుని నుండి ముప్పు వున్నది కావున నీ కుమారునికి పట్టాభిషేకము చేసి రాజ్యరక్షణా బాధ్యతలు చేపట్టాలి కావున నీవు కూడా మా మాట విని అంతఃపురమునకు మారాలి పొమ్ము "అని పలికిరి .
అప్పుడా తార "ఓ వీరులారా !నా భర్తే నా లోకము ఆయన మరణించినచో ఈ రాజ్యముతో నాకు పని లేదు . కుమారునితో కూడా పని లేదు . ఆయన చరణముల నేడే నాకు స్వర్గము "అని పలికి బోరున ఏడ్చుచు రణరంగమునకు వచ్చెను అచట ఆమె ముందుగా విల్లిను నేలపై పెట్టి దాని మీద చెయ్యి వేసి నిలబడిన శ్రీరాముని పక్కనే వున్నలక్ష్మణుని ,వారి వెంటే వున్నా సుగ్రీవుని నిర్మల బుద్దితో చూసేను . వారిని దాటుకుని వాలి వద్దకు వచ్చి పెద్దపెట్టున ఎడ్వానారంభించెను .
పెద్ద పెద్ద వృక్షములను కొండలను సైతము పీకి పారవేయగల వాలి ఇప్పుడు పరమ దీనావస్థలో వున్నాడు . శత్రువు ఎంతటి గొప్పవాడైన సునాయాసముగా ఓడించితిరిగి రాగల వీరుడు ఇప్పుడు తిరిగిరాని లోకములకు పోవుటకు సిద్దమై వున్నాడు . ఆమెకు గుండె పగిలినట్టు అనిపించెను . ఆమె ఆర్యాపుత్రా !అని బిగ్గరగా ఏడ్చుచుండెను . ఆడ లకుముకి పిట్ట వలే ఏడ్చుచున్న తారను ఆమె వెంటే వున్నా అంగదుడను చూసి సుగ్రీవుడు మిక్కిలి విషాదమునకు లోనయ్యేను .
రామాయణము కిష్కిందకాండ పందొమ్మిదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment