Saturday 3 March 2018

రామాయణము కిష్కిందకాండ -పదమూడవసర్గ

                                        రామాయణము 

                                  కిష్కిందకాండ -పదమూడవసర్గ 

రామలక్ష్మణులు ,సుగ్రీవుడు ,ఆంజనేయాది వీరులు కిష్కింధకు పయనమయి కొండలను వాగులను దాటుతూ అడవిదారి వెంట నడకసాగించిరి . దారిలో  ఎన్నో పరిమళాభూరితమైన పుష్పములు కల వృక్షములు ,పెద్దపెద్ద చెట్లు కలవు అవి చూచుటకు మిక్కిలి రామణీయముగా ఉండెను వాటిని చూసిన రాముడు సుగ్రీవునితో "మిత్రమా !ఈ వృక్షముల యొక్క ప్రత్యేకత తెలుపుము "అని కోరగా సుగ్రీవుడు "మిత్రమా !ఇచట "సప్తజనులు "అని ప్రసిద్ధి చెందిన ఏడుగురు మునులు ఇచట కఠోరమైన తపో నియమములను పాటించుచు తలకిందులుగా వారమునకు ఒక్కసారిమాత్రమే వాయుభక్షణము చేయుచు ఆహారము ముట్టక తపము చేసిరి . 
వారి తపస్సు ఫలించి వారు సశరీరముతో స్వర్గమునకు వెళ్లిరి . అయినను వారు ఇచటికి వచ్చి యజ్ఞయాగాదులు నిర్వర్తించెదరని ఇచటి వారు చెప్పుకుందురు . ఆ ప్రదేశములోకి మనుష్యులు కాను పశుపక్షాదులు కానీ ప్రవేశించలేవు . వెళ్లిన వారు తిరిగి రాలేరు . "అని ఆశ్రమము చూపించి చెప్పెను . మరల సుగ్రీవుడు రాముని తో "మిత్రమా ఆ ముని ఆశ్రమమునకు నమస్కరించుము . వారికి నమస్కరించిన వారికి సకల కోరికలు తీరి శుభములు కలుగును "అని పలికి తానును నమస్కరించెను .పిమ్మట వారు పెక్కు దూరము పయనించి కిష్కింధకు చేరుకొనిరి . 

రామాయణము కిష్కిందకాండ పదమూడవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



No comments:

Post a Comment