రామాయణము
కిష్కిందకాండ -ఇరువదియవసర్గ
శ్రీరాముని బాణాపుదెబ్బచే నేలపై పది ఉన్న వాలిని ఆ తార కౌగలించుకుని "ఓ వానరవీరా !యుద్ధమున తిరుగులేనివాడవు . వానరులలో ప్రముఖుడవు . నీవంటి మహారాజు ఇలా నేలపై పరుండుట తగునా !లే లేచి తగిన శయ్యపై పరుండుము . నీకు అత్యంత ప్రియమైన భార్యనైన నేను ఈ విధముగా నీ చెంతనే ఉండి ఈవిధముగా విలపించుచుండగా కానేసాము మారు పలుకవేమి ? కనీసము నీ గారాల పుత్రుడైన అంగదుడనైనా ఊరడించవేమి ?మేము నీకు అప్రియములైన ఏ పనులు చేసినాము ?ఇక నుండి నువ్వు అల్లారుముద్దుగా పెంచిన అంగదుడు పినతండ్రి కోపతాపములు భరించుచు జీవించవలెను కాబోలు " అంటూ ఏడ్చెను . తిరిగి కుమారునివైపు తిరిగి . "నాయనా !అంగదా !మీ తండ్రి ని కనులారా చూచుకో మల్లి ఆ అదృష్టము దక్కదు ". అని పలికి తిరిగి వాలివైపు తిరిగి "నీవు నీ హితము కోరి నేను చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి నీ తమ్ముడి భార్య రామ ను చెర పట్టి చేచేతులారా ఈ దుస్థితిని తెచ్చుకున్నావు . "
అని అప్లికి సుగ్రీవునితో "ఓ సుగ్రీవా !నీ కోరిక నెరవేరినది కదా తండ్రి వంటి అన్నగారిని పొట్టన పెట్టుకున్నావు . ఆయన విగత జీవుడై పడివున్నాడు ఇప్పుడు నీకు సంతోషమేగా ఇక నీ భార్యతో సంతోషముగా వుండు . ఈ రాజ్యమును ఏలుకో !"అనెను . అంటూ బిగ్గరగా ఏడ్చుచూ వాలివైపు తిరిగి "ఓ నాధా !నేను నీ భార్యలు అందరూ వచ్చి వున్నారు మమ్ములను కనీసము ఒక్కసారైనా చూడవేమి ?అజ్ఞానముతో మేమేమయినా దోషము చేసి ఉంటే మమ్ము మన్నించు "అనెను. తిరిగి ఆమె నా ప్రియమైన భర్త చనిపోయి పడివున్ననూ ఇంకనూ నా హృదయము బద్దలవలేదంటే నేను బహుశా పాషాణ హృదయురాలిని అయివుంటానని ఏడ్చి ప్రాయోపవేశమునకు సిద్దపడెను
రామాయణము కిష్కిందకాండ ఇరువదియవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు