Thursday 23 August 2018

రామాయణము కిష్కిందకాండ - ఇరువది అయిదవసర్గ

                                        రామాయణము  

                                                                         

                                 కిష్కిందకాండ - ఇరువది అయిదవసర్గ 

శ్రీ రాముడు దుఃఖించుచున్న తార సుగ్రీవుడు అంగదుడు మొదలగు వారిని ఓదార్చి ,వాలి అంతిమ సంస్కారమునకు ఏర్పాట్లు చేయమని చెప్పెను . ఆ బాధ్యతను లక్ష్మణుడు తీసుకుని వాలి అంతిమసంస్కారమునకు కావలిసిన వస్తువు అన్ని దగ్గరుండి తెప్పించి  అంతిమ వీడ్కోలు ఘనముగా ఏర్పాటు చేసెను . చక్కగా అలంకరించబడిన పల్లకీని తీసుకువచ్చి దానిపై వస్త్రాభరణములతో అలంకరించిన వాలి మృత దేహమును చేర్చి ,ముందు వానరులు విలువైన రత్నములు చల్లుచుండగా పల్లకీని తీసుకువచ్చిరి . 
ఎండిన కట్టెలు గంధపు చెక్కలతో వాలి దేహమునకు సంస్కారములు నిర్వహించిరి . ఆ సమయములో తారను అతి కష్టము మీద తక్కిన వానర స్త్రీలు పట్టుకోగలిగారు . పిమ్మట వాలికి తర్పణములు వదులుటకు వారందరూ నాదీ జలముల వద్దకు వెళ్లిరి . రామలక్ష్మణులు ,సుగ్రీవుడు ,తార అంగదులను ముందు ఉంచుకుని ఆ వానర ప్రముఖులంతా తర్పణములు వదిలిరి . ఈ సమస్త కార్యమును రామలక్ష్మణులు దగ్గరుండి నడిపించిరి . కార్యక్రమము అయ్యిన పిమ్మట సుగ్రీవుడు రాముని వద్దకు వచ్చి నిలబడెను . 

రామాయణము కిష్కిందకాండ ఇరువదియైదవసర్గ సమాప్తము . 

                                                  శశి ,

ఎం . ఏ .ఎం . ఏ (తేలుగు ),తెలుగు పండితులు . 

                                                                                          

No comments:

Post a Comment