రామాయణము
యుద్ధకాండ - తొంబదితొమ్మిదవ సర్గ
సుగ్రీవుడి చేతిలో మహోదరుడు మరణించుట చూసి మిక్కిలి బల శాలి అయిన మహాపార్శ్వుడు కోపంతో , అంగదుడి సైన్యమును తన బాణములతో హింసించ సాగెను . వేగంగా వీచే గాలికి తొడిమెల నుండి ఫలములు రాలి పడిపోయినట్లు ఆ రాక్షసుని బాణముల దాటికి ప్రముఖులైన వానర యోధుల శిరస్సులు శరీరముల నుండి వేరై రణభూమి అంతటా పడిపోయెను . మహాపార్శ్వుని బాణపరంపర కు దెబ్బ తినిన ఆ వానరులు దాదాపు స్పృహలేని స్థితికి గురిఅయి విషాద గ్రస్తులై యుద్ధ విముఖులైరి .
అపుడు తన బలములు భీతిల్లుట చూసిన అంగదుడు పున్నమినాటి సముద్రుడివలె విజృంభించెను . మహాపార్శ్వుడు, వాలిసుతుడు ఆ సమరభూమి అందు మిక్కిలి భీకరముగా యుద్ధముచేసిరి ఆ సంగ్రామములో అంగదుడు మహాపార్శ్వుని అంతమొందించెను . అది చూసిన రాక్షస సైన్యము మిక్కిలి భీతిల్లిరి రావణుడు క్రోధముతో ఊగిపోయెను .
వానరులు పట్టరాని సంతోషముతో ఆకాసము తాకినట్లు సింహనాదం చేసిరి . అది విని రావణుడు కదనరంగమున యుద్ధసన్నద్దుడై నిలిచెను .
రామాయణము, యుద్ధకాండ - తొంబదితొమ్మిదవ సర్గ ---- సమాప్తము .
శశి,
ఎం ఏ , ఎం ఏ( తెలుగు) ,
తెలుగుపండితులు .
No comments:
Post a Comment