రామాయణము
ఉత్తరకాండ -ఎనుబదిరెండవసర్గ
శ్రీరాముడు అగస్త్యుడు చెప్పిన దండకారణ్య వృత్తాంతమును విని ,పిమ్మట అగస్త్యుని ఆదేశము ప్రకారం ,పవిత్రమైన సరస్సు వద్దకు వెళ్లి ,స్నాన సంధ్యావందనాది కార్యక్రమములు ముగించుకుని తిరిగి అగస్త్యుని ఆశ్రమమునకు చేరెను . పిమ్మట శ్రీరాముడు అగస్త్యుడు పెట్టిన కందమూలములను ,కూరగాయలను ,శాల్యాన్నమును తృప్తిగా భుజించెను . ఆరోజు రాత్రి అక్కడే విశ్రమించి ,
మరునాడు ప్రాతఃకాలమే లేచి ,అగస్త్యుడి అనుమతి తీసుకుని ,ప్రయాణమునకు సన్నద్ధుడై పుష్పకము ఎక్కి అగస్త్యుడికి మిగిలిన మునులకు అభివాదం చేసెను . ఆ మునులందరూ శ్రీరాముని దీవించిరి . పిమ్మట శ్రీరాముడు పుష్పకముపై అయోధ్య చేరెను . పుష్పకమును పంపివేసి ద్వారపాలకునితో "నా రాకను గురించి లక్ష్మణునికిభరతునికి తెలిపి ,వెంటనే వారిని నా వద్దకు రమ్మను "అని పలికెను .
రామాయణము ఉత్తరకాండ ఎనుబదిరెండవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment