Saturday 12 August 2017

రామాయణము అరణ్యకాండ -అరువదియైదవసర్గ

                                                 రామాయణము 

                                                     అరణ్యకాండ -అరువదియైదవసర్గ 

సీతాదేవి ఎడబాటు వలన మిక్కిలి కృశించి వున్న రాముడు లోకములను నాశనము చేయుటకై కోపముతో రగిలిపోసాగెను . అప్పుడు లక్ష్మణుడు "అన్నా !ఇచట ఉన్న ఆనవాళ్లను బట్టీ ఇక్కడ ఇద్దరు వీరులకు భీకర యుద్ధము జరిగినదని తెలుస్తున్నది . కానీ ఇచట ఆనవాళ్లు గమనించినట్లయితే ఇక్కడ నాశనమై పడిపోయిన వస్తువులన్నీ ఒకే వ్యక్తి కి సంబందించినవి . సైన్యము కూడా యుద్దములో పాల్గొనలేదని తెలియవచ్చుచున్నది . కావున ఒక్కడు చేసిన తప్పుకు లోకములను శిక్షించుట నీవంటి ఉత్తముడు చేయదగిన పనికాదు . 
నీవు ధనుర్భాణములు ధరించి సీతాన్వేషణకై కదులుము నేను నీకు తోడుగా ఉండెదను . మునులు మనకు సహాయము చేయుదురు . నీ ధర్మపత్నిని అపహరించి న దుష్టుడు దొరుకునంతవరకు ఈ సమస్త భూమండలమును ,పాతాళమును ,సముద్రమును వెతుకుదాము . నీవు న్యాయ బద్దముగా వెతికినను వదినగారు దొరకనిచో   నీవు కోరుకున్నట్టే లోకములను నాశనము చేద్దువుగాని "అని లక్ష్మణుడు పలికెను . 





 రామాయణము అరణ్యకాండ అరువదియైదవసర్గ సమాప్తము . 

                           శశి ,

ఎం.  ఏ ,ఎం . ఏ ,తెలుగు పండితులు






 

No comments:

Post a Comment