రామాయణము
అరణ్యకాండ -అరువదియైదవసర్గ
సీతాదేవి ఎడబాటు వలన మిక్కిలి కృశించి వున్న రాముడు లోకములను నాశనము చేయుటకై కోపముతో రగిలిపోసాగెను . అప్పుడు లక్ష్మణుడు "అన్నా !ఇచట ఉన్న ఆనవాళ్లను బట్టీ ఇక్కడ ఇద్దరు వీరులకు భీకర యుద్ధము జరిగినదని తెలుస్తున్నది . కానీ ఇచట ఆనవాళ్లు గమనించినట్లయితే ఇక్కడ నాశనమై పడిపోయిన వస్తువులన్నీ ఒకే వ్యక్తి కి సంబందించినవి . సైన్యము కూడా యుద్దములో పాల్గొనలేదని తెలియవచ్చుచున్నది . కావున ఒక్కడు చేసిన తప్పుకు లోకములను శిక్షించుట నీవంటి ఉత్తముడు చేయదగిన పనికాదు .
నీవు ధనుర్భాణములు ధరించి సీతాన్వేషణకై కదులుము నేను నీకు తోడుగా ఉండెదను . మునులు మనకు సహాయము చేయుదురు . నీ ధర్మపత్నిని అపహరించి న దుష్టుడు దొరుకునంతవరకు ఈ సమస్త భూమండలమును ,పాతాళమును ,సముద్రమును వెతుకుదాము . నీవు న్యాయ బద్దముగా వెతికినను వదినగారు దొరకనిచో నీవు కోరుకున్నట్టే లోకములను నాశనము చేద్దువుగాని "అని లక్ష్మణుడు పలికెను .
No comments:
Post a Comment