Monday 14 August 2017

రామాయణము అరణ్యకాండ -అరువది ఏడవసర్గ

                            రామాయణము 

                       అరణ్యకాండ -అరువది ఏడవసర్గ 

శ్రీరాముడు లక్ష్మణుని మాటలు విని కోపము తగ్గించుకుని లక్ష్మణుడు చెప్పినట్టు ఆ దండకారణ్యప్రాంతమంతా  వెతుకసాగెను . కొంత దూరము వెళ్లిన పిమ్మట పెద్ద ఆకారము రక్తమోడుతూ కనిపించెను . ఆ పర్వతాకారములో వున్న ప్రాణిని చూసిన శ్రీరాముడు అది రాక్షసుడేమో సీతను మింగేసాడేమో అని ఊహించి ఆ ప్రాణిని చంపుటకు ధనుస్సుని పట్టుకొనెను . అప్పుడా ప్రాణి "రామా !నేను జటాయువుని . సీతను రావణుడు అపహరించి తీసుకుపోవుచుండగా నేను అడ్డగించినాను . నా శాయశక్తులా యత్నించినాను . ఆ రావణుడి రధమును ,అతడి సారధిని నాశనము చేసితిని . పిమ్మట అతడు నా రెక్కలు కాళ్ళు నరికి జానకిని తీసుకుని వెళ్ళిపోయాడు . "అని పలికెను . 
అప్పుడు శ్రీరాముడు తన తండ్రి మిత్రుడు తనకు అత్యంత ఆప్తుడు అయిన జటాయువు ఆ విధముగా ప్రాణాపాయ స్థితిలో ఉండుట చూసి మిక్కిలి బాధపడెను . పిమ్మట రాముడు ఆ గ్రద్ద ను తాకుతూ ఏడవసాగెను . తన పెన్నిధి దూరమయినట్లుగా బాధపడసాగెను . 

రామాయణము అరణ్యకాండ అరువదియేడవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ ,ఎం. ఏ ,తెలుగు పండితులు . 






No comments:

Post a Comment