Thursday 3 August 2017

రామాయణము అరణ్యకాండ -అరువదినాల్గవసర్గ

                                 రామాయణము 

                           అరణ్యకాండ -అరువదినాల్గవసర్గ 

శ్రీరాముడు అటుల రోధించుచు ,తాను శోదించినను ,మరల తిరిగి లక్ష్మణుని గోదావరి నదీ తీరమునకు వెళ్లి ,సీతను వెతకమని చెప్పెను . లక్ష్మణుడు అచటకు వెళ్లి వెతికి అచట సీతాదేవి కనపడక పోవుటచే అదే విషయమును రామునికి విన్నవించెను . పిమ్మట రాముడు సీతకొరకై శోకించుచు ,"సీత ఎచటకు వెళ్ళినదో ఓ మృగములారా  చెప్పుము . ఓ వృక్షములారా చెప్పుము "అని బిగ్గరగా అరువగా మృగములన్నీ ఒక్కసారిగా లేచి దక్షిణ దిశగా పరిగెడుతూ మాటిమాటికీ రామునివంక  సీతజాడ చెబుతున్నావా అన్నట్లు చూచుచుండెను . 
అది గమనించిన లక్ష్మణుడు అన్నతో "అన్నా !ఈ మృగముల కదలికలను బట్టీ వదినగారు జాడ ఈ దిశగా వెళ్ళినచో తెలియునను అనిపించుచున్నది "అని పలికి ఇరువురు దక్షిణ దిశగా నడవసాగిరి . పిమ్మట రాముడు నేలపై పది వున్న పూరేకులను చూచెను . వాటిని గుర్తించిన రాముడు "లక్ష్మణా !ఈ పూరేకులు మీ వదినగారు ధరించినవే . వీటిని నేనే తెచ్చి ఆమెకు ఇచ్చితిని . "అని పలికెను . కొంత దూరము వెళ్లిన పిమ్మట విరిగి పడిపోయిన ధనస్సు ,కవచము ,రధము ,చనిపోయిన అశ్వములు ,మొదలగున్నవి కనిపించునేయు . వాటిని చూసిన రాముడు లక్ష్మణునితో "లక్ష్మణా !ఈ బంగారు ధనుస్సు ఎవరిదీ అయివుండును ? ఈ బంగారు కవచము ,విరిగిపోయిన రధము ,అశ్వములు ,మొదలగున్నవి చూచుచుంటే ,ఇద్దరు రాక్షసులు సీత కొరకై యుద్ధము చేసుకుని ఉండవచ్చునని అనిపించుచున్నది "అని పలికెను . 
పిమ్మట రాముడు ఎర్రబారిన కళ్ళతో మిక్కిలి క్రుద్ధుడై లక్ష్మనునితో "లక్ష్మణా !ఈ వృక్షములు కొండలు ,మృగములు నాకు సీతజాడ చెప్పుకున్నచో నేను ఈ సమస్త లోకమును నాశనము చేసెదను "అని పలుకసాగెను . 

రామాయణము అరణ్యకాండ అరువదినాల్గవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment