Tuesday 22 October 2019

రామాయణము యుద్ధకాండ -డెబ్బదియైదవసర్గ

                                  రామాయణము 

                                    యుద్ధకాండ -డెబ్బదియైదవసర్గ 

సుగ్రీవుడు శ్రీరాముడితో జరిగిన యుద్ధమును అంతా అలోచించి ,హనుమతో "హనుమా !మన వానరవీరులు కాగడాలచేతబూని ఈ రోజు రాత్రి సమయములో లంకా నగరమునకు నిప్పుపెట్టవలెను "అని ఆజ్ఞాపించెను . సుగ్రీవుడి ఆజ్ఞ మేరకు వానరులు ప్రాకారమును దాటి లంకా నగరంలోకి ప్రవేశించి ,ఆ నగరములోకల ప్రాకారములు ఇళ్లకు నిప్పు పెట్టసాగెను . దానితో భయపడిన రాక్షసులు పారిపోసాగిరి . ఇళ్లకు నిప్పు అంటుకోవటంతో ,ఆ లంకా నగరము అంతా హాహాకారములు చెలరేగినవి . అది గమనించిన రావణుడు కుంభకర్ణుని కుమారులైన కుంభుడు ,నికుంభుడు అనువారిని వారికి తోడుగా అనేక బలగములను ఇచ్చి యుద్ధమునకు పంపెను . యుద్ధము కోసమే ఎదురుచూస్తున్న వానరవీరులు రెట్టింపు ఉత్సాహముతో యుద్ధమునకు దిగిరి . ఆ రాత్రి సమయములో వానరులకు రాక్షసులకు మధ్య భయంకరమైన యుద్ధము జరిగెను . 

రామాయణము యుద్ధకాండ డెబ్బదియైదవసర్గ సమాప్తము . 

                           శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment