Tuesday 15 October 2019

రామాయణము యుద్ధకాండ -డెబ్బదిమూడవసర్గ

                                   రామాయణము 

                                 యుద్ధకాండ  -డెబ్బదిమూడవసర్గ 

తన సోదరులు ,పుత్రులు మరణించుటచే వారిని తలుచుకుని దుఃఖించుచున్న రావణుడిని చూసిన అతని కుమారుడు ఇంద్రజిత్తు ,తండ్రికి ధైర్యము చెప్పి ,అగ్నికార్యము చేసి అగ్ని దేవుడికి హవిస్సులను సమర్పించి ,బ్రహ్మాస్త్రమును తీసుకుని అదృశ్య రూపములో యుద్ధరంగమునకు వెళ్లెను . అక్కడి ఎవ్వరికి కనపడకుండా వానరసైన్యముపై బాణవర్షమును కురిపించెను . అతడి బాణపరంపరకు వానరసైన్యము రక్తసిత్తమయ్యెను . పెక్కుమంది యుద్ధ భూమిలో పడిపోయిరి . 
సుగ్రీవుడు ,నలుడు ,నీలుడు ,హనుమంతుడు ,జాంబవంతుడు మొదలగు వీరులుకూడా ,ఇంద్రజిత్తు చేతిలో గాయములపాలయ్యిరి . వారు తిరిగి దాడి చేయుటకు ఇంద్రజిత్తు ఎక్కడఉన్నాడో తెలియలేదు . రామలక్ష్మణులపై ఇంద్రజిత్తు మంత్రించి బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను . అది వారిని బాదించకపోయినను ,బ్రహ్మదేవుడుపై కల గౌరవముతో వారు స్పృహ తప్పినట్టుగా యుద్దభూమిపై పడిపోయిరి . అది చూసిన రాక్షస వీరులు ఇంద్రజిత్తుకి జయజయద్వానములు చేసిరి . అది చూసిన ఇంద్రజిత్తు లంకా నగరంలోకి ప్రవేశించి తండ్రి వద్దకు వెళ్లి జరిగిన యుద్ధమును ఉత్సాహముతో చెప్పెను . 

రామాయణము యుద్ధకాండ డెబ్బదిమూడవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



No comments:

Post a Comment