రామాయణము
ఉత్తర కాండ ----నలుబదినాలుగవ సర్గ
భద్రుడి మాటలు విన్న రాముడు, భద్రుడు మొదలైన వారిని పంపివేసి తన కర్తవ్యమును నిశ్చయించుకున్నాడు . భరతుడిని ,లక్ష్మణుడిని , శత్రుఘ్నుడిని తీసుకు రమ్మని ద్వార పాలకుడిని పంపెను . ద్వార పాలకుడి మాటలు విని ఆ ముగ్గురు వెను వెంటనే తమ అన్న శ్రీ రాముడి మందిరంలోకి ప్రవేశించి అంజలి ఘటించిరి . ఆ సమయములో శ్రీ రామ చంద్రుడి మొహము మిక్కిలి విచారంగా ఉండెను . వారు ముగ్గురు శ్రీ రాముడి పాదములకు సిరసా ప్రణమిల్లి అట్లే ఉండిపోయిరి వారిని చూసిన వెంటనే శ్రీ రాముడి కళ్ళ నుండి కన్నీరు జల జల కారినవి. శ్రీ రాముడు వారిని పైకి లేపి గుండెలకు హత్తుకొనెను .
పిమ్మట వారిని కూర్చో పెట్టి వారితో " సోదరులారా ! మీరే నాకు పంచ ప్రాణములు . మీరందరు శాస్త్ర విధులను పాటించు వారు . తెలివి తేటలు కలవారు . మీరు ముగ్గురు ఒక్కటై నేను చెప్పా బోయే కార్యమును చేయవలెను . " అని పలికెను .
రామాయణము ------ఉత్తరకాండ-------నలుబదినాలుగవసర్గ ---------సమాప్తం .
శశి,
ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు),తెలుగు పండిట్ .
No comments:
Post a Comment