రామాయణము
యుద్ధకాండ -ఏబదిఒకటవసర్గ
రామలక్ష్మణులు కోలుకోవటం చూసిన వానరుల సమూహము పెద్దగా కోలాహలంగా ధ్వని చేసెను . ఆ ధ్వనిని విని ఏమి అర్ధము కానీ రావణుడు తన పక్కనే వున్న కొంత మంది రాక్షసులను విషయము కనుక్కురమ్మని పంపెను . వెంటనే ఆ రాక్షసులు వెళ్లి రామలక్ష్మణులు సజీవంగా ఉండుట చూసి వచ్చి రావణుడికి అదే విషయమును తెలిపిరి . ఆ మాటలు విన్న రావణుడు విషసర్పముల వంటి ఇంద్రజిత్తు బాణములు ఎలా విఫలము అయ్యోయో తెలియక ఆలోచించసాగెను .
పిమ్మట రావణుడు" ధూమ్రాక్షుడు "అనే రాక్షసుడిని యుద్ధరంగమునకు వెళ్ళుటకు ఆజ్ఞాపించెను . వెంటనే 'ధూమ్రాక్షుడు 'అపారమైన సైన్యమును వెంట పెట్టుకుని పశ్చిమ ద్వారము వైపుగా యుద్ధమునకు బయలుదేరెను . అప్పటికే అక్కడ హనుమ లెక్కలేనంత వానరసైన్యముతో కూడి పశ్చిమద్వారము వద్ద యుద్ధము కొరకై నిలిచి ఉండెను . ధూమ్రాక్షుడు యుద్దమునకై రధము మీద వచ్చుచుండగా అతనికి అనేకమైన అపశకునములు కనిపించెను . ఆ అపశకునములు అపారంగా వున్న వానరసేనను చూసేసరికి ధూమ్రాక్షునికి కలవరపాటు మొదలయ్యెను .
రామాయణము యుద్ధకాండ ఏబదిఒకటవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment