రామాయణము
యుద్ధకాండ -నలుబదితొమ్మిదవసర్గ
రామలక్ష్మణులు భయంకరమైన నాగాస్త్రముచే బందీలు అయి శరీరమంతా రక్తసిత్తమై పడివుండిరి . సుగ్రీవుడు మిగిలిన వానరులంతా వారి చుట్టూ చేరి ,కంగారుపడుతూ ఉండిరి . పరాక్రమశాలి ఐన శ్రీరాముడు నాగాస్త్రముతో బందించబడినప్పటికీ బలశాలి ,ధీరుడు కావున స్పృహలోకి వచ్చెను . స్పృహలోకి వచ్చిన శ్రీరాముడు పక్కనేపడివున్న తమ్ముడు లక్ష్మణుడిని చూసి మిక్కిలి విలపించెను . లక్ష్మణుడు లేనిచో తనకు సీతతోకాని ,తుదకు తన ప్రాణములతో కానీ పని ఏమున్నది బాధపడెను . లక్ష్మణుడు మరణించినచో తానూ మరణించేదని పలికెను .
పిమ్మట సుగ్రీవుని తిరిగి కిష్కింధకు వెళ్లిపొమ్మని చెప్పెను . హనుమకు అంగదునికి కృతఙ్ఞతలు తెలిపి మిక్కిలి బాధపడసాగెను . అప్పుడు విభీషణుడు సైన్యమును తగురీతిగా నిలబెట్టి రామలక్ష్మణులు వున్నా చోటికి రాసాగేను . కొందరు వానరులు అతడిని చూసి ఇంద్రజిత్తు అని భయపడి పారిపోయిరి .
రామాయణము యుద్ధకాండ నలుబదితొమ్మిదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment