రామాయణము
యుద్ధకాండ -ఏబదిరెండవసర్గ
ధూమ్రాక్షుడు సైన్యముతో వచ్చుట చూసిన హనుమ ,మిగిలిన వానరులు రెట్టింపు ఉత్సాహముతో యుద్ధమునకు దిగెను . రాక్షసులు శూలములతో ,గదలతో రకరకాల ఆయుధములతో వానరులపై దాడికి దిగిరి . వానరులంతా రాళ్లతో ,చెట్లతో యుద్ధమునకు దిగిరి . వారి గోళ్లు ,పళ్లే వారికి ఆయుధములు . సమరప్రదేశమంతా రక్తసిత్తమయ్యెను . పచ్చి నెత్తురు తాగే రాక్షసులు వానరుల దాటికి నోటా రక్తము కక్కినారు .
వానరుల విజృంభణ గమనించిన ధూమ్రాక్షుడు వానరులను అనేక బాణములతో బాధించుట మొదలుపెట్టేను . ఆ బాణ పరంపరలకు వానరులు తట్టుకొనలేక విలవిలలాడుట చూసిన హనుమ ధూమ్రాక్షుడి రథముపైన పెద్ద కొండరాయిని విసిరెను . అది గమనించిన ధూమ్రాక్షుడు తన గదను తీసుకుని రధమునుండి కిందకు దూకేను . పిమ్మట అతడు హనుమపైకి తన ముళ్ల గదను ప్రయోగించెను . అప్పుడు హనుమ పెద్ద పర్వతముతో ధూమ్రాక్షుడిపైకి దాడికి దిగెను . ధూమ్రాక్షుడి గద తనను గాయపరిచినా లెక్కచేయకుండా హనుమ పర్వతముతో దాడి చేయుటచే ధూమ్రాక్షుడు అక్కడికక్కడే నామరూపములు లేకుండా మరణించెను . ధూమ్రాక్షుడు మరణించుట చూసిన అతడి సైన్యము భయముతో పరుగులు తీసిరి .
రామాయణము యుద్ధకాండ ఏబదిరెండవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment