రామాయణము
యుద్ధకాండ -నలుబదిఆరవసర్గ
ఇంద్రజిత్తు ఉనికి తెలుసుకొనుటకై వెళ్లిన పదిమంది వానరులు ఆకాశము ,భూమిపై అంతా వెతికి అతడు కనపడకపోవుటచే తిరిగి రామలక్ష్మణులు వున్న చోటికి వచ్చిరి . సుగ్రీవుడు ,విభీషణుడు ,జాంబవంతుడు మిగిలిన వానరులందరూ రామలక్ష్మణులు వున్న చోటికి వచ్చి చూసి మిక్కిలి శోకసంతస్తులయ్యిరి .
వారందరిని చూసిన ఇంద్రజిత్తు సైన్యముతో "చూసినారా ఖరదూషణాదులను చంపిన రాముడిని , సోదరుడు లక్ష్మణుడు ని చంపాను . దేవతలే దిగి వచ్చినా రక్షించలేరు . మనల్నందరిని ఇంత ఇబ్బంది పెట్టిన వారిని నేను హతమార్చివేసాను . "అని పలికి నీలుని వాడి అయిన తొమ్మిది బాణములతో కొట్టెను . మైందుని ద్వివిదుని మూడు బాణములతో ,జాంబవంతుని ఒక మీద ,హనుమంతునిపై బాణములతో ,ఇంకా కొంత మంది మీద ప్రయోగించి ఇంద్రజిత్తు యుద్ధరంగమునుండి లంకా నగరము లోకి ప్రవేశించెను .
రామలక్ష్మణుల దురవస్థ చూసిన సుగ్రీవుడు ధైర్యమును కోల్పోయి ,మిక్కిలి బాధపడసాగెను . అక్కడి వాతావరణము అంతా శోకముతో నిండిపోయెను . కన్నీరుమున్నీరు గా విలపించుచున్న సుగ్రీవుని విభీషణుడు తన మాటలతో ఓదార్చెను . "సుగ్రీవా !యుద్దములో ఈ విధముగా గాయపడుట సర్వసాధారణము . రామలక్ష్మణులకు . వారిని హతమార్చగలవారు దేవతలలో లేరు . వారు ఆ నాగాస్త్ర ప్రభావము నుండి భయటపడు వరకు జాగ్రత్తగా రక్షించవలెను . తర్వాత వారే మన బాగోగులు చూసుకుంటారు . వుంది సమస్త సైన్యమునకు ధైర్యము చెప్పు "అని పలికి మంత్రం పూరిత నీతితో సుగ్రీవుని నేత్రములను తుడిచెను . ఆ ప్రభావమున రాక్షస మాయలను సుగ్రీవుడు గుర్తించగలడు .
యుద్ధ రంగము నుండి అంతః పురములోకి ప్రవేశించిన ఇంద్రజిత్తు తండ్రిని చేరి రామలక్ష్మణులు మరణించిరని తెలిపెను . ఆ మాటలు విన్న రావణుడు సంతోషముతో కౌగిలించుకొని యుద్ధ విశేషములు చెప్పమని కోరెను . అప్పుడు ఇంద్రజిత్తు యుద్ధరంగములో తన ప్రదర్శించిన విశేషములను తండ్రికి పూర్తిగా వివరించి చెప్పెను .
రామాయణము యుద్ధకాండ నలుబదిఆరవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ, ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment