Monday 9 October 2017

రామాయణము కిష్కిందకాండ -ఏడవసర్గ

                                             రామాయణము 

                                                     కిష్కిందకాండ -ఏడవసర్గ 

శ్రీరాముడు శోకార్తుడై అలా వచించిన పిమ్మట సుగ్రీవుడు శ్రీరాముడికి నమస్కరించి "ప్రభూ !ఆ రావణుని గురించి నాకు ఏమి తెలియదు అయినప్పటికీ వాడు ఎచట దాక్కున్ననూ ,కనిపెట్టి వానిని మృత్యుమార్గమునకు పంపెదను . మీరు ఈ విధముగా భాదపడుట యుక్తము కాదు . బాధ సర్వారిష్టములకు మూలకారణము . కావున దానిని వీడి ,ఇప్పుడు చేయవలసిన కర్తవ్యమును ఆలోచించుడు . నా భార్యను కూడా వాలి అపహరించాడు . నీవును నా వలెనే ధైర్యముగా ఉండుము . "అని పలికి శ్రీరాముని కౌగిలించుకొనెను . 

సుగ్రీవుని మాటలకు శ్రీరాముడు "సుగ్రీవా !సమయోచితముగా నీవు మాట్లాడిన మాటలకు నేను ఊరడిల్లితిని . నీవు చెప్పినట్టే రావణుని వెతికి చంపెదము "అని పలికెను . శ్రీరాముని మాటలు విన్న సుగ్రీవుడు ,ఆంజినేయుడు మొదలగువారు ఊరడిల్లిరి . పిదప రామసుగ్రీవులు ఇరువురు ఒకరికష్టములను ఒకరు చెప్పుకొంటిరి . ఒకరినొకరు ఓదార్చుకొనిరి . 

రామాయణము కిష్కిందకాండ ఏడవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .        





No comments:

Post a Comment