రామాయణము
కిష్కిందకాండ -ఏడవసర్గ
శ్రీరాముడు శోకార్తుడై అలా వచించిన పిమ్మట సుగ్రీవుడు శ్రీరాముడికి నమస్కరించి "ప్రభూ !ఆ రావణుని గురించి నాకు ఏమి తెలియదు అయినప్పటికీ వాడు ఎచట దాక్కున్ననూ ,కనిపెట్టి వానిని మృత్యుమార్గమునకు పంపెదను . మీరు ఈ విధముగా భాదపడుట యుక్తము కాదు . బాధ సర్వారిష్టములకు మూలకారణము . కావున దానిని వీడి ,ఇప్పుడు చేయవలసిన కర్తవ్యమును ఆలోచించుడు . నా భార్యను కూడా వాలి అపహరించాడు . నీవును నా వలెనే ధైర్యముగా ఉండుము . "అని పలికి శ్రీరాముని కౌగిలించుకొనెను .
సుగ్రీవుని మాటలకు శ్రీరాముడు "సుగ్రీవా !సమయోచితముగా నీవు మాట్లాడిన మాటలకు నేను ఊరడిల్లితిని . నీవు చెప్పినట్టే రావణుని వెతికి చంపెదము "అని పలికెను . శ్రీరాముని మాటలు విన్న సుగ్రీవుడు ,ఆంజినేయుడు మొదలగువారు ఊరడిల్లిరి . పిదప రామసుగ్రీవులు ఇరువురు ఒకరికష్టములను ఒకరు చెప్పుకొంటిరి . ఒకరినొకరు ఓదార్చుకొనిరి .
No comments:
Post a Comment