Wednesday 4 October 2017

రామాయణము కిష్కిందకాండ -అయిదవసర్గ

                                    రామాయణము 

                                      కిష్కిందకాండ -అయిదవసర్గ 

అప్పుడు హనుమంతుడు ఋష్యమూక పర్వతము నుండి మలయగిరికి చేరి ,సుగ్రీవుని రామలక్ష్మణులున్న ప్రదేశమునకు తీసుకువచ్చి ,ఆ కపిరాజుకి వారిని గూర్చి చెప్పసాగెను . వారి గురించి సవివరముగా వివరించి సుగ్రీవుని భయమును పోగొట్టి ,వారితో స్నేహము చేయమని చెప్పెను . ఆంజనేయుడి మాట విని సుగ్రీవుడు రామలక్ష్మణులను ఆలింగనము చేసుకుని వారితో మైత్రిని ఏర్పరచుకొనెను . వారు కూర్చొనుటకు ఆసనములు ఏర్పాటుచేసెను . 
పిమ్మట వారందరూ ఎంతో ప్రీతితో మాట్లాడుకొనసాగిరి  . అప్పుడు దీనవదనుడై సుగ్రీవుడు తన అన్న వాలి తనపై కోపమును పెంచుకుని తనను రాజ్యమునుండి వెడలగొట్టటం తన భార్య రుమను అపహరించుట మొదలైన సమస్త విషయములను వివరముగా చెప్పి రాముడి సహాయమును అర్ధించెను . రాముడు వెనువెంటనే సుగ్రీవునికి అభయహస్తము ఇచ్చి ,అతడిని ఓదార్చెను . ఆ సమయములో వాలికి,సీతాదేవికి ,రావణునికి ఒకేసారి ఎడమకన్ను అదిరెను . 

రామాయణము కిష్కిందకాండ అయిదవసర్గ సమాప్తము . 

                              శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



No comments:

Post a Comment