రామాయణము
అయోధ్యకాండ -తొంబదియవసర్గ
రాకుమారుడైన భరతుడు దూరమునుండే భరద్వాజాశ్రమమును చూచి తన బలములను అచటనే నిలిపి శస్త్రములను ,ఆభరణములు విడిచి పట్టు వస్త్రములు ధరించేను . పురోహితుడైన వశిష్ఠుడు ముందు నడుచుతుండగా భరతుడు మంత్రులతో కూడి కాళీ నడకతో భరద్వాజాశ్రమమును చేరెను . ఆశ్రమము వద్దకు చేరిన పిమ్మట మంత్రులను అచటనే నిలిపి వశిష్టుని వెంట ఆశ్రమములోకి నడిచెను .
భారద్వాజముని వశిష్టుని చూసి వారికి ఎదురేగి అతిధి సత్కారములు చేసెను . భరతుడు వినమ్రుడై తన ప్రవరాలను తెలుపుతూ మునికి నమస్కరించెను . పిదప ముని భరతుని ఎరిగి "రాజ్యాధికారం నీవు ఇటు వచ్చుటకు కారణమేమి ?"అని ప్రశ్నించెను . అప్పుడు భరతుడు జరిగినదానిలో తన ప్రమేయము లేదని వివరించెను . శ్రీరాముని తిరిగి తీసుకువచ్చుటకు వచ్చితినని చెప్పగా భరద్వాజుడు సంతోషించి భరతుని ఆశీర్వదించెను . పిమ్మట ఆ ముని సీతారాంలక్ష్మణులు చిత్రకూట మహా పర్వతమున వశించుచున్నారని తెలిపెను . వారిని ఆ రోజు అచట విశ్రమించి మరునాడు బయలుదేరి శ్రీరాముని వద్దకు వెళ్ళాలలిసినదిగా కోరెను . భరతుడు "ఓ మునీశ్వరా !మీ ఆజ్ఞను శిరాశావహింతును "అని పలికి ఆ రాత్రికి ఆ ఆశ్రమము నందే గడుపుటకు నిశ్చయించినేను .
No comments:
Post a Comment