రామాయణము
అయోధ్యకాండ -------------ఎనుబదిఆరవసర్గ
గుహుడు లక్ష్మణుని గూర్చి భరతునితో "వారు ఇచటికి వచ్చినపుడు రాత్రి లక్ష్మణుడు ధనుర్భాణములు ధరించి సీతారాములను రక్షించుటకై జాగరూకుడై ఉండెను . అపుడు నేను లక్ష్మణుని వద్దకు వెళ్లి నేను ఈ అడవీ ప్రాంతాలన్నీ బాగుగా ఎరుగుదును . నీవు విశ్రమించుము . నేను జాగరూకుడై రక్షించెదను . అని పలుకగా అప్పుడు లక్ష్మణుడు మా అన్న ,వదినలు నేలపై పరుండుట చూస్తుంటే నిద్ర ఎలా వస్తుంది ?ఆకలి దప్పుడు ఉంటాయా ?మా తండ్రి దశరథ మహారాజు శ్రీరాముడు దూరమైన కారణముచేత ఎక్కువ కాలము జీవించి ఉండడు . భరత శత్రుఘ్నులు వారికి ఉత్తర క్రియలు నెరవేర్చెదరు . వారెంత అదృష్టవంతులో కదా !అంతః పుర స్త్రీలు ఏడ్చి ఏడ్చి ఏడుపు రాక మౌనముగా వుండివుంటారు . శ్రీరాముడు వనవాసము ముగించుకొని అయోధ్యకు వెళ్లునప్పుడు నేను ఆయనతో కూడి వెళ్లగలనో లేదో అని పలికెను . మేము ఆ విధముగా మాట్లాడుకొనుచుండగానే తెల్లవారెను . పిదప వారు మఱ్ఱి పాలతో జడలను ధరించి ధనుర్భాణములు ధరించి సీతతో కూడి గంగను దాటి సావధానులై ముందుకు సాగిరి ". అని చెప్పెను .
No comments:
Post a Comment