Thursday 9 February 2017

రామాయణము అయోధ్యకాండ -తొంబదిఆరవసర్గ

                                          రామాయణము 

                                అయోధ్యకాండ -తొంబదిఆరవసర్గ 

ఆ విధముగా శ్రీరాముడు సీతాదేవికి చిత్రకూటపర్వత అందములు చూపుతూ ఆమెకు ఫలముల గుజ్జును ,కందమూలములను పెట్టి ఆమెకు ప్రియమును కూర్చెను . ఆ విధముగా వారు చిత్రకూట పర్వతముపై వుండి భాషించుకుంటున్న సమయములో జంతువులు. అప్పుడు భయముభయముగా పెరిగిడసాగినవి . దూళి ఆకాశమునకు తాకుచున్నది .  అప్పుడు  రాముడు లక్ష్మణుని పిలిచి 
"లక్ష్మణా !ధూళి ఆకాశమును తాకుచున్నది . గజములు మొదలగు జంతువులూ భయముతో పరిగెడుచున్నవి . బహుశా ఏ రాజో ,లేక రాకుమారుడో వేటకి వచ్చివుండును . లేక క్రూర మృగములు వచ్చి ఉండును . ఏమిటో చూడు "అని పలికెను . అన్న ఆదేశమును అనుసరించి లక్ష్మణుడు చిత్రకూట పర్వతముపై కల అత్యంత ఎత్తయిన మద్ది చెట్టు ఎక్కి ఒక మహాసేనను ,వాటి రధములపై ఎగురు ధ్వజ పతాకములను చూసి అన్న వద్దకు వచ్చి 
"హోమాగ్నిని ఆర్పుము . అప్పుడే శత్రువులు మన జాడను కనిపెట్టలేరు . సీతాదేవిని బద్రముగా గుహలో దాయుము ,ధనుర్భాణములు ధరించుము "అని పలికెను అప్పుడు రాముడు "లక్ష్మణా !వచ్చినదెవరో బాగుగా పరిశీలించితివా ?"అని ప్రశ్నించగా ,లక్ష్మణుడు "అన్నా !వచ్చినది కైకేయి పుత్రుడైన భరతుడు . బహుశా మన అడ్డును తొలగించుకొనుటకు వచ్చివుండును . ధనుర్భాణములు ధరించి నేను అతడిని తుదముట్టించెదను . అతడిని చంపుట పాపము అవదు . మన శత్రువు చావుటకు మన చెంతకే వచ్చినాడు . నేడే కైకేయిని ఆమెతో అనుబంధము కల మంధర మున్నగు వారిని అందరిని తుదముట్టించెదను . ఆమె కారణముగా ఎంతో కలుషితమైన ఈ భూమండలం కు పాప విముక్తి కలిగించెదను . నీవు నీ రాజ్యమును ఏలుకోవచ్చును . 

రామాయణము అయోధ్యకాండ తొంబది ఆరవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment