Sunday 5 February 2017

రామాయణము అయోధ్యకాండ -తొంబదిరెండవసర్గ

                                              రామాయణము 

                                             అయోధ్యకాండ -తొంబదిరెండవసర్గ 

భరతుడు భరద్వాజుడు ఇచ్చిన ఆతిధ్యమును శ్వీకరించి ఆ రాత్రి అచట హాయిగా ఉండెను . శ్రీరాముని దర్శించవలెననే కోరికతో భరతుడు వేకువజామునే లేచి ,తల్లులు ఇతర పరివారముతో కలసి వీడ్కోలు చెప్పుటకై భారద్వాజముని చెంతకు వెళ్లెను . ఆ మునితో ఆతిధ్యమునకు సంతుష్టుడనైతిని చెప్పి అన్న దగ్గరకు వెళ్ళుటకు అనుమతిని కోరెను . 
అప్పుడు భరద్వాజుడు "నాయనా !మీ అన్నగారిని చూడవలెనని నీవు పడుతున్న ఆత్రం నాకు సంతోషాన్ని కలిగించుచున్నది . మీ తల్లిగార్ల గురించి తెలుసుకోగోరుతున్నాను . తెలుపుము "అని పలికెను . అప్పుడు భరతుడు ఆమునితో "మునివర్యా !నావెనక నిలబడిన,బక్కచిక్కిన ఈమె రామజనని కౌశల్యాదేవి . మా తండ్రి దశరధుని పట్టపురాణి . ఆమెను ఆనుకుని వున్న ఈమె సుమిత్రాదేవి మిక్కిలి శాంత స్వభావురాలు ,లక్ష్మణశత్రుఘ్నుల జనని . ఇక ఈమె మిక్కిలి గర్విష్టి మా తల్లి ఈమె కారణముగానే మా అన్నగారు అడవులపాలయినారు . మా తండ్రి మరణించారు "అని పలికెను . 
అప్పుడు భరద్వాజుడు "నాయనా !కైకేయిని నిందించుట తగదు . మున్ముందు రామ అరణ్యవాసము వల్ల ఎన్నో సత్కార్యములు జరగనున్నాయి . ఇది విధిరాత "అని పలికి శ్రీరామ వాసము అయిన చిత్రకూటమునకు దారిని తెలిపి ఆశీర్వదించి పంపెను . భరతుడి ఆదేశమును అందుకున్న సమస్త సేన చిత్రకూటము వైపుగా ప్రయాణము సాగించెను . ఆసెన చూచుటకు పెద్ద అరణ్యమువలె గోచరించుచున్నది . 

రామాయణము అయోధ్యకాండ తొంబదిరెండవసర్గ సమాప్తము . 

శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment