Saturday 30 September 2017

రామాయణము కిష్కిందకాండ -నాల్గవసర్గ

                                      రామాయణము 

                                        కిష్కిందకాండ -నాల్గవసర్గ 

హనుమంతుడు లక్ష్మణుని మధుర వచనములు విని సుగ్రీవుని తలుచుకుని సుగ్రీవునికి మేలు జరుగునని సంతోషించి రామలక్ష్మణులతో "ఓ వీరులారా !వనములతో ,భయమకరమైన క్రూర మృగములతో దట్టముగా వున్న ఈ వనంలోకి మీరు ఎలా వచ్చితిరి . ?అని ప్రశ్నించగా లక్ష్మణుడు "ఓ వానరవీరా !దశరధుడు అను మహారాజు కలడు ఆయన మిక్కిలి ధార్మికుడు . పుత్రసంతానములేక పుత్రసంతానముకోసము వారు పుత్రకామేష్టి యాగము చేయగా తత్ఫలితముగా ఆయనకు నలుగురు పుత్రులు జన్మించారు . వారిలో అగ్రుడు శ్రేష్ఠుడు శ్రీరాముడు ,మా అన్నగారు నేను ఈయన చిన్న తమ్మడు లక్ష్మణుడిని . 

తండ్రి మాట నిలుపుటకై అన్నగారు సమస్త రాజ్యభోగములను ,రాజ్యాధికారమును విడిచి ,అడవులలో ఉండుటకు వచ్చెను . నేను ,ఆయన ధర్మపత్ని ,జనకనందిని అయిన సీతాదేవి ఆయనను అనుసరించి వచ్చితిమి . 

మేమెవరమూ లేని సమయము చూసి మాయావి ఐన ఒక రాక్షసుడు మా వదినగారిని అపహరించాడు . 

ఆవిడను వెతుకుతూ ఇచటికి వచ్చితిమి . కబంధుడు అనే రాక్షసుడు మరణించుతూ తన పూర్వరూపమును ధరించి సుగ్రీవుని కలిసిన సీతాదేవి జాడ తెలియును అని తెలిపెను . సుగ్రీవుని కొరకై అన్వేషించుచున్నాము . "అని పలికెను . 
ఆ మాటలు విన్న హనుమంతుడు "ఓ రాకుమారులారా !మా రాజు సుగ్రీవునుకును మీ సహాయము అవసరము . అదృష్టవశమున మీ దర్శనము మాకు లభించినది . ప్రస్తుతము మా ప్రభువు తన అన్న వాలి తో వైరము ఏర్పడి రాజ్యభ్రష్టుడైనాడు . ఆ వాలి సుగ్రీవుని వంచించి ,ఆయనను రాజ్యభ్రష్టుడిని చేయుటయే కాక ఆయన భార్య రుమను అపహరించెను . తత్ఫలితముగా వనములపాలైతిమి . సూర్యపుత్రుడైన సుగ్రీవుడు మాతో కలిసి సీతాదేవిని వెతుకుటకు మీకు సహాయపడగలడు . "అని పలికి బ్రాహ్మణరూపము వదిలి తన వానరరూపమును దాల్చి రామలక్ష్మణులు ఇరువురిని తన భుజములపై ధరించి సుగ్రీవుని వద్దకు తీసుకెళ్ళేను . 

రామాయణము కిష్కిందకాండ నాల్గవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 













No comments:

Post a Comment