Saturday 11 January 2020

రామాయణము యుద్ధకాండ -ఎనుబదిమూడవసర్గ

                                 రామాయణము 

                                       యుద్ధకాండ -ఎనుబదిమూడవసర్గ 

రాక్షసులు ,వానరులు చేసిన యుద్దకోలాహలము విన్న శ్రీరాముడు తన పక్కనే వున్న జాంబవంతుని వానరులకు సహాయముగా పంపెను . శ్రీరాముడి ఆజ్ఞ ప్రకారము జాంబవంతుడు సేనతో యుద్ధము జరుగుతున్న ప్రదేశమునకు బయలుదేరెను . వారికి దారిలోనే వానరసేనతో పాటుగా హనుమంతుడు కనిపించెను . హనుమంతుడు జాంబవంతుని ఆపి తనతోపాటుగా శ్రీరాముడి వద్దకు తీసుకువచ్చెను . అప్పుడు హనుమ శ్రీరాముడితో దీనస్వరంతో "ప్రభూ !పరమదుర్మార్గుడైన రావణసుతుడు శోకించుచున్న జానకీ మాతను నేను చూస్తుండగానే యుద్ధరంగములో వధించినాడు "అని పలికెను 
ఆ మాటలు వినగానే శ్రీరాముడు మొదలు నరికిన మహా వృక్షము వలె నేలపై కూలిపోయెను . అప్పుడు వానరులందరూ కంగారుతో శ్రీరాముని చుట్టుముట్టిరి . నీరు తీసుకువచ్చి శ్రీరామునిపై  చిలకిరించిరి .స్పృహ లోకి వచ్చిన శ్రీరాముడు సోకసముద్రములో మునిగి కన్నీరుమున్నీరు అయ్యెను . ఆ సమయములో వానరులందరూ శోకముతో గొంతులు పూడిపోయి బొమ్మలులా నిలబడి ఉండిరి . అప్పుడు శ్రీరాముడి తమ్ముడైన లక్ష్మణుడు తానూ ధైర్యము తెచ్చుకుని ,శ్రీరాముని ఓదార్చెను 

రామాయణము యుద్ధకాండ ఎనుబదిమూడవసర్గ సమాప్తము . 

                                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





 

No comments:

Post a Comment