Saturday 11 January 2020

రామాయణము యుద్ధకాండ -ఎనుబదినాలుగవసర్గ

                                 రామాయణము 

                                యుద్ధకాండ -ఎనుబదినాలుగవసర్గ 

శ్రీరాముని లక్ష్మణుడు ఓదార్చుచుండగా విభీషణుడు అప్పుడే అక్కడికి వచ్చెను . అక్కడ వున్న వారందరి ముఖములు దీనంగా ఉండుట చూసిన విభీషణుడు విషయము తెలుసుకుని శ్రీరాముడితో "రామా !మా అన్న ఐన రావణుడి ఆంతర్యము నాకు తెలుసు అతడు సీతాదేవిని వధించడు . వానర వీరుల ఉత్సాహము నీరుకార్చుటకై తద్వారా యుద్ధమును గెలుచుటకై మాయావి ఐన ఇంద్రజిత్తు పన్నిన పన్నాగము ఇది . అతడు యుద్ధరంగమున హతమార్చింది నిజముగా సీతామాతను కాదు . మాయా సీతను మాత్రమే . మనలందరిని శోకములో ముంచి యుద్ధము గెలుచుటకై నికుంబలా యాగము చేయుటకు వెళ్ళినాడు . అతడు ఆ యాగము పూర్తి చేసినచో అతడిని గెలుచుట ఇంద్రాదులకు కూడా సాధ్యము కాదు కావున మనము ఇప్పుడే బయలుదేరి ఆ యాగము జరుగు ప్రదేశమునకు వెళ్లి ,ఆ యాగమునకు ఆటంకము కలిగించాలి . లక్ష్మణుని మాతో పంపు అతడి నిశిత శరములకు ఆ ఇంద్రజిత్తు యమలోక గతుడు అవుట తధ్యము "అని పలికేను . 

రామాయణము యుద్ధకాండ ఎనుబదినాలుగవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 
                         




No comments:

Post a Comment