రామాయణము
యుద్ధకాండ -ఎనుబదిరెండవసర్గ
ఆ విధముగా యుద్ధరంగమున వెనుతిరిగి పారిపోవుచున్న వానరవీరులను చూసిన హనుమ వారిని ఆఫై వారికి ఉత్సాహము కలిగించి యుద్ధరంగమునకు వచ్చెను . ఇంద్రజిత్తుపై విపరీతమైన కోపముతో వున్న వానరవీరులందరూ తమ యావత్ శక్తితో కసి తీరా యుద్ధము చేయసాగిరి . ఆ విధముగా కసితో యుద్ధము చేయుచున్న వానరుల దాటికి రాక్షసులు తట్టుకొనలేకపోయిరి . చాలా మంది రాక్షసులు మరణించిరి .
పిదప వానరవీరులందరితో కలిసి ,హనుమ శ్రీరామునికి జానకీ దేవిని ఇంద్రజిత్తు హతమార్చిన విషయము తెలుపుటకై శ్రీరాముడు వున్నా చోటికి బయలుదేరివెళ్లెను . వారు శ్రీరాముడి దగ్గరకు వెళ్ళుట చూసిన ఇంద్రజిత్తు నికుంబలా యాగము చేయదలచి లంకలోకి వెళ్లిపోయెను . నీకుంబలా యాగమునకు కావలసిన ఏర్పాట్లు చేయించి విధివిధానంగా యాగము చేయనారంభించెను .
రామాయణము యుద్ధకాండ ఎనుబదిరెండవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment