రామాయణము
యుద్ధకాండ -ఎనుబదిఆరవసర్గ
నికుంబలా యాగము జరుగుతున్న ప్రదేశమునకు చేరిన పిమ్మట అక్కడ అపారంగా ఉన్న రాక్షస సైన్యముపైకి లక్ష్మణుడు విభీషణుడి సలహా ప్రకారము తన బాణముల వర్షమును కురిపించెను . లక్ష్మణుడి వెనక వున్న వానరసైన్యము కూడా రాక్షసవీరులతో తలపడసాగిరి . వానరుల దాటికి తట్టుకోలేక అనేక మంది రాక్షస వీరులు మరణించిరి . పెక్కుమంది గాయములపాలయ్యిరి .
ఎదిరింప శక్యము కానీ తన సేన ,వానరభల్లూక సేన చేతిలో చావుదెబ్బ తినిన విషయము విన్న ఇంద్రజిత్తు వెంటనే హోమమకార్యము మాని లేచి రధమును అధిరోహించి యుద్ధమునకు బయలుదేరెను . యుద్ధరంగములో హనుమంతుడు తన సేనను చిత్తుచిత్తుగా కొట్టుట చూసి కోపముతో ఊగిపోతూ హనుమపై అనేక బాణములు ప్రయోగించెను . కానీ అవేమి హనుమను ఏమిచేయలేకపోయినవి . అది చూసిన విభీషణుడు ,ఇంద్రజిత్తుపై బాణప్రయోగము చేయమని లక్ష్మణుడికి చెప్పెను .
రామాయణము యుద్ధకాండ ఎనుబదిఆరవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment