Tuesday 28 January 2020

రామాయణము యుద్ధకాండ -ఎనుబది ఎనిమిదవసర్గ

                           రామాయణము 

                         యుద్ధకాండ -ఎనుబది ఎనిమిదవసర్గ 

విభీషణుడి మాటలు వినినంతనే ఇంద్రజిత్తు మిక్కిలి కోపోద్రిక్తుడయ్యెను . పిమ్మట అతడు పరుషముగా మాట్లాడుతూ ,ఎగిసిపడుతూ ముందుకు వచ్చెను . ఆ రావణ సుతుని రధము చక్కగా అలంకృతమై ఉండెను . పిమ్మట గర్వితుడై వున్న ఇంద్రజిత్తు లక్ష్మణుడిని ,విభీషణుడిని ,వానరశ్రేష్ఠులని ఉద్దేశించి "ఆకాశము నుండి పడు జడివానవలె సమరభూమి అందు నా ధనస్సు నుండి తిరుగులేని బాణ పరంపరను వర్షింపచేసెదను . నేను ప్రయోగించెడి శరములు  అగ్ని దూదికుప్పవలె మీ శరీరములను దహించి వేయగలవు . శరములతో వివిధరకముల ఆయుధములతో మిమ్ములను చీల్చి చెండాడి మృత్యుముఖమునకు పంపెదను . నా ముందు నిలవగల మొనగాడెవ్వడు ?ఓ లక్ష్మణా !ఇదివరకే నా బాణము దెబ్బ తిని తృటిలో మృత్యువును తప్పించుకుంటివి . ఇప్పుడు మరల యుద్ధము చేయుటకు వచ్చితివి . నీకు యమసధనమునకు చేరవలెనని కోరికగా వున్నట్టుగా ఉన్నది . "అని పలికెను . 
ఇంద్రజిత్తు పోలికేకలు విన్న లక్ష్మణుడు అతడితో "శత్రువులను యమసధనమునకు పంపుట అనే కార్యములో నీవు ఇంతకు మునుపే నీవు విఫలమయినావు . వ్యర్థముగా ఎందుకు మాట్లాడెదవు .ఆనాడు కనపడకుండా పిరికిపందలా దాక్కుని యుద్ధము చేసితివి . అది దొంగల పద్దతి . నిజముగా వీరుడైనవాడు బయపడి దాగుకొనడు . నీరు ప్రతాపమును ఇప్పుడు చూపించు "అని పలికెను . 
అప్పుడు ఇరువురి మధ్య భయంకరమైన యుద్ధము మొదలయినది . లక్ష్మణుడు ఇంద్రజిత్తుని అయిదు బలమైన బాణములతో కొట్టెను . ఇంద్రజిత్తు మూడు బాణములతో లక్ష్మణుడిని దెబ్బతీసేను . నరరాక్షసశ్రేష్ఠులైన వారిరువురు సమరభూమి అందు స్థిరముగా నిలిచి అనేక రకములగు శరములను ప్రయోగించుచు ,అత్యుత్సాహముతో యుద్ధము చేసిరి . వారిరువురు ఇంద్రశంబరాసురలును తలపింపచేయుచు తీవ్రముగా యుద్ధము చేయుచుండిరి . 

           రామాయణము యుద్ధకాండ ఎనుబదియెనిమిదవసర్గ సమాప్తము . 

                                శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 










No comments:

Post a Comment