రామాయణము
అయోధ్యకాండ -ఎనుబది అయిదవసర్గ
నిషాద రాజైన గుహుడు ఆ విధముగా పలికిన పిమ్మట ,భరతుడు నిషాద రాజుతో "సోదరా !నీవు మా అన్న అగు శ్రీరామునికి పరమ మిత్రుడవు ,మాయీ అపారసేనకు ఆతిధ్యము ఇవ్వదలిచితివి చాలా సంతోషము . ఆతిధ్యము ఇచ్చినట్లే భావించుము . ఈ దండకారణ్యం లో భారద్వాజముని ఆశ్రమమునకు దారి తెలుపుము . "అని పలికెను .
నిషాద రాజు గుహుడు "నేను నా సేన లోకల శ్రేష్టమైన విలుకాళ్లు మీకు తోడుగా వచ్చి ,దగ్గర ఉండి మిమ్ము ఆశ్రమమునకు చేర్చెదను . స్వామీ !నాదొక సందేహము . మీ అన్న అగు శ్రీరాముడు ఎవ్వరికిని కీడు తలపెట్టనివాడు . అట్టి వానిని చూచుటకు ఇంత సైన్యముతో వెళ్ళవలసిన పని ఏమున్నది ?దయతో నా సందేహమును తీర్చుము "అని పలికెను .
ఆ మాటలు విన్న భరతుడు తనకు రాజ్యకాంక్ష ఏమాత్రము లేదని ,తన అన్నను తిరిగి రాజ్యమునకు తీసుకు వచ్చుటకు మాత్రమే వెళ్తున్నానని స్పష్టం చేసెను . ఆ మాటలు విన్న గుహుడు మిక్కిలి సంతోషించెను . భరతుడు తన సేనను విశ్రమించుటకు ఆజ్ఞను ఇచ్చెను . పిమ్మట అతడు తన గుడారములో చేరి శ్రీరామునకై చింతించుచు ఉండెను . గుహుడు అతడిని ఓదార్చెను .
రామాయణము అయోధ్యకాండ ఎనుబదియైదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment