Tuesday 31 January 2017

రామాయణము అయోధ్యకాండ -ఎనుబది అయిదవసర్గ

                                         రామాయణము 

                                        అయోధ్యకాండ -ఎనుబది అయిదవసర్గ 

నిషాద రాజైన గుహుడు ఆ విధముగా పలికిన పిమ్మట ,భరతుడు నిషాద రాజుతో "సోదరా !నీవు మా అన్న అగు శ్రీరామునికి పరమ మిత్రుడవు ,మాయీ అపారసేనకు ఆతిధ్యము ఇవ్వదలిచితివి చాలా సంతోషము . ఆతిధ్యము ఇచ్చినట్లే భావించుము .  ఈ దండకారణ్యం లో భారద్వాజముని ఆశ్రమమునకు దారి తెలుపుము . "అని పలికెను . 
నిషాద రాజు గుహుడు "నేను నా సేన లోకల శ్రేష్టమైన విలుకాళ్లు మీకు తోడుగా వచ్చి ,దగ్గర ఉండి మిమ్ము ఆశ్రమమునకు చేర్చెదను . స్వామీ !నాదొక సందేహము . మీ అన్న అగు శ్రీరాముడు ఎవ్వరికిని కీడు తలపెట్టనివాడు . అట్టి వానిని చూచుటకు ఇంత సైన్యముతో వెళ్ళవలసిన పని ఏమున్నది ?దయతో నా  సందేహమును తీర్చుము "అని పలికెను . 
ఆ మాటలు విన్న భరతుడు తనకు రాజ్యకాంక్ష ఏమాత్రము లేదని ,తన అన్నను తిరిగి రాజ్యమునకు తీసుకు వచ్చుటకు మాత్రమే వెళ్తున్నానని స్పష్టం చేసెను . ఆ మాటలు విన్న గుహుడు మిక్కిలి సంతోషించెను . భరతుడు తన సేనను విశ్రమించుటకు ఆజ్ఞను ఇచ్చెను . పిమ్మట అతడు తన గుడారములో చేరి శ్రీరామునకై చింతించుచు ఉండెను . గుహుడు అతడిని ఓదార్చెను . 

రామాయణము అయోధ్యకాండ ఎనుబదియైదవసర్గ సమాప్తము . 

            శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



No comments:

Post a Comment