రామాయణము
యుద్ధకాండ -నలుబది అయిదవసర్గ
శ్రీరాముని ఆదేశము మేరకు ఇంద్రజిత్తు ఆచూకీ తెలుసుకొనుటకు 'సుషేణుడి కుమారులు ఇద్దరు ,నీలుడు ,అంగదుడు ,శరభుడు ,వినతుడు ,జాంబవంతుడు ,సానప్రస్తుడు ,ఋషభుడు ,ఋషభస్కందుడు 'మొదలగు 10 మంది వానరవీరులు పెద్దపెద్ద వృక్షములను పట్టుకుని ఆకాశమునకు ఎగిరిరి . ఇంద్రజిత్తు తన ఆచూకీ కోసము ఆకాశములోకి ఎగిరిన వానరులను చూసి వారిపై భయంకరములైన బాణములను ప్రయోగించెను . మాయా యుద్ధము చేయుచుండుటచే ఆ వీరులు ఇంద్రజిత్తుని కనిపెట్టలేకపోయిరి .
ఇంద్రజిత్తు మాయా రూపమున ఉండియే ,ఇంకా నాగాస్త్రములను రామలక్ష్మణులపై ప్రయోగించుచు ఉండెను . ఆ బాణముల దాటికి రామలక్ష్మణుల శరీరము రక్తసిత్తమయ్యెను . హనుమంతుడు మొదలగు వానర ప్రముఖులందరూ రణరంగమున రఘువీరులు నాగాస్త్రముచే బంధింపబడి యుండగా చూసి ,వారి సమీపమున చుట్టూ చేరి ఆర్తులై తీరని దుఃఖంలో మునిగిపోయిరి .
రామాయణము యుద్ధకాండ నలుబదియైదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment