Wednesday 7 August 2019

రామాయణము యుద్ధకాండ -ముప్పదియేడవసర్గ

                                     రామాయణము 

                                   యుద్ధకాండ -ముప్పదియేడవసర్గ 

శ్రీరాముడు,లక్ష్మణుడు  ,సుగ్రీవుడు ,హనుమంతుడు ఇంకా మిగిలిన వానర ప్రముఖులందరూ ఒక చోట సమావేసమయ్యిరి . యుద్దమునకై సమాలోచన చేయసాగిరి . అప్పుడు విభీషణుడు శ్రీరామునితో "ప్రభూ ! నా మంత్రులు పక్షుల రూపములో రావణుని లంకకు వెళ్లి ,అక్కడి రక్షణ వ్యవస్థను తెలుసుకుని వచ్చారు "అని పలికి లంకలో రక్షణకై రావణుడు చేసిన ఏర్పాట్లన్నీ శ్రీరాముడితో విభీషణుడు వివరముగా చెప్పాడు . ఇంకా రావణునికి కల బలము ,బలగము కూడా వివరించి చెప్పెను . 
అప్పుడు శ్రీరాముడు విభీషణుడితో "విభీషణా !వానరులలో మహావీరుడైన నీలుడు లంక యొక్క తూర్పు ద్వారము వైపున నిలుచును . అంగదుడు లంక యొక్క దక్షిణద్వారము వైపున నిలిచి ,మహాపార్శ్వ మహోదరుని చీల్చి చెండాడతాడు . హనుమంతుడు పశ్చిమద్వారము వైపున నిల్చి ,ఇంద్రజిత్తుని చిత్తూ కావించి లంకలో ప్రవేశించగలడు . రావణుడు ఉత్తరద్వారమున రక్షణకై వున్నాడు కదా నేను లక్ష్మణుడితో కలిసి అతడిని దెబ్బతీసి అతడి అహమును అణుస్తాను . వానరులకు ప్రభువైన సుగ్రీవుడు ,జాంబవంతుడు ,విభీషణుడు లంక మధ్యలో వున్న సైనిక బలముపై దాడిచేయుదురు . వానరులు కామరూపులైనా వారు మానవ రూపము దాల్చరాదు . సైన్యములో మనవారిని గుర్తించుటకు అదే కొండగుర్తు . "అని పలికి శత్రు నిర్మూలనమునకై  శ్రీరాముడు సైన్యముతో సహా లంకా నగరము వైపుగా నడవసాగెను . 

రామాయణము యుద్ధకాండ ముప్పదియేడవసర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





No comments:

Post a Comment