Saturday 1 February 2020

రామాయణము యుద్ద కాండ -ఎనుబదితొమ్మిదవసర్గ

                                    రామాయణము 

                                          యుద్ద కాండ -ఎనుబదితొమ్మిదవసర్గ 

లక్ష్మణుడు ధనుష్టంకారము చేసి ,రెచ్చిపోయిన పాము వలె బుసలు కొడుతూ ,ఇంద్రజిత్తుపై వాడి ఐన బాణములు ప్రయోగించెను .  బాణపు దెబ్బకి ఇంద్రజిత్తు శరీరము గాయము అయ్యి ఇంద్రజిత్తు కొద్దిసేపు మిన్నకుండెను . కొద్దిసేపటి తర్వాత కోలుకున్న ఇంద్రజిత్తు కోపముతో రంకెలు వేస్తూ ,లక్ష్మణుని ,హనుమంతుని ,విభీషణుని తన బాణములతో గాయ పరిచేను . పిమ్మట లక్ష్మణుడు కోపోద్రిక్తుడై ఇంద్రజిత్తుపై బాణములు ప్రయోగించేను . ఆ బాణముల దెబ్బకి ఇంద్రజిత్తు కవచము ముక్కలయ్యేను . ఇంద్రజిత్తు కూడా తన బాణములతో లక్ష్మణుడి కవచము కూడా ముక్కలయ్యేను . 
భయంకరముగా రణ గర్జనము చేస్తూ ఒకరిపై ఒకరు శరములను వర్షించుచుండిరి . చాలాసేపు వారిరువురు ఈ విధముగా యుద్ధము చేయుచున్నను ,వారికి విసుగు రాలేదు . బడలిక లేదు . వారు చేయు గర్జనలు ఆ యుద్ధ శబ్దములు విను వారికి భీకరములగు పిడుగుపాటు వలె ఉండెను . అప్పటివరకు లక్ష్మణునికి కొద్దీ  దూరములో ఉన్న విభీషణుడు లక్ష్మణునికి ఉత్సాహము కలిగించుటకు అతనికి దగ్గరగా వచ్చెను . 

రామాయణము యుద్ధకాండ ఎనుబదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment