Sunday, 3 March 2019

రామాయణము కిష్కిందకాండ-ఏబదితొమ్మిదవ సర్గ

                                  రామాయణము 

                                  కిష్కిందకాండ-ఏబదితొమ్మిదవ సర్గ 

గ్రద్ద రాజైన సంపాతి నుడివిన అమృతతుల్యములగు వచనములు విన్న పిమ్మట ఆ వానరులందరును పరమానందభరితులైరి . వానర శ్రేష్ఠుడైన జాంబవంతుడు తోడి వానరులందరితో గూడి వెంటనే లేచి , నేలపై నిలబడెను . పిమ్మట అతడు సంపాతి ఇటలీ ప్రశ్నించెను . "ఇంతకును సీతాదేవి లంకనందు ఎక్కడ ఉన్నది ఆమెను చూచినవారెవరు ? ఆమెను ఎవరు అపహరించిరో నీకు ఎవరు చెప్పారు ?. 
అప్పుడు సంపాతి ఇట్లనెను "నేను  వృద్ధుడనై ఉన్నందున , నా ప్రాణశక్తియు బలపరాక్రమములు క్షీణించినవి , ఇట్టి స్థితిలో ఉన్న నన్ను నా కుమారుడైన సుపార్ఫ్యూడు ఆహారాదులను సమకూర్చి నన్ను పోషించుచున్నాడు. 
ఒకానొక నాడు ఆకలితో నాకనకలాడుచుంటిని . నాకు ఆహారము తీసుకొని వచ్చుటకై నా కుమారుడు బయటకు వెళ్లెను . మాంసము దొరకక పోవుటచే అతడు సూర్యుడు అస్తమించిన పిమ్మట రిక్త హస్తములతో తిరిగి వచ్చెను. అది చూచి మిక్కిలి ఆవాసముతో నేను నా కుమారుని తీవ్రముగా మందలించితిని. తిండి లేక భాదపడుచున్న నన్ను ఓదార్చి  ఇట్లు చెప్పదొండగెను "తండ్రీ !నేను ఎప్పటివలె ఆహారము సంపాదించుకొని వచ్ఛుటకై ఆకాశమునకు ఎగిరితిని . అంట మహేంద్రగిరి ద్వారము కడకు చేరి అచట నిలబడితిని . ఆ సమయమున చేదింపబడిన కాటుక కొండవలె నల్లగా నున్న ఒక దుష్టుడు ఒక స్త్రీ ని తీసుకొని పోవుచుండుట నేను చూచితిని . 
ఆ స్థితిలో ఉన్న నేను వారిద్దరిని నీకు ఆహారముగా తీసుకువచుటకు నిశ్చయించితిని . కానీ పురుషుడు సవినయముగా దారి ఇమ్ము అని నన్ను మృదువు గా అడిగెను నీచుడు సైతము తనను సవినయముగా సమీపించిన  వానిని హింసించడు . ఇక నా విషయమున చెప్పవలిసిన పని లేదు . ఆ తరువాతనే అక్కడి మునులచే నాకు తెలిసినది అతడు రావణాసురుడిని , ఆ స్త్రీ సీతాదేవి అని , శ్రీరాముని ధర్మ పత్ని అని , ఆమెను అతడు అపహరించుకు పోతున్నాడనియు నేను తెలుసుకొంటిని ఆమె రామలక్ష్మణులను  స్మరించుచుండెను "అని పలికెను . ఆ విషయము విన్నప్పటికీ , ఆదుష్టుడి పై విజృంభించాలనే ఆలోచన నాకు రాలేదు . ఏల ననగ  నేను రెక్కలు తెగిన పక్షిని , అనిపలికెను . 

రామాయణము -కిష్కిందకాండ - ఏబదితొమ్మిదవసర్గ . 

     శశి,

ఎం.ఏ,ఎం.ఏ,(తెలుగు),తెలుగుపండితులు . 








రామాయణము కిష్కిందకాండ -ఏబదియెనిమిదవసర్గ

                               రామాయణము 

                           కిష్కిందకాండ -ఏబదియెనిమిదవసర్గ 


వానరుల మాటలు విన్న సంపాతి , కన్నీరు పెడుతూ వనరులతో" ఓ వానరులారా మీరు తెలిపిన జటాయువు నాతమ్ముడు పూర్వము వృత్తాసురుడు వద్ద అనంతరం నేను నా తమ్ముడు పోటీపడి పైపైకి ఎగరనారంభించెను నేను మిక్కిలి పైకి ఎగురట చే , సూర్యకాంతి వేడికి నారెక్కలు తెగి ఇచ్చట పడిపోతిని అప్పటినుండి నా తమ్ముడు గురించిన ఈ వివరములు నాకు తెలియనేలేవు "అని పలికెను. 
ఆ మాటలు విన్న అంగదుడు "ఓ పక్షి రాజా , నీకు తెలిసిన చొ  రావణుడి స్థావరం , దయ తో తెలుపుము , అని పలికెను" . అప్పుడు సంపాతి"ఓ వానరులారా  నేను రెక్కలు కాలిన  పక్షినిఐనా శ్రీ రామునికి చేతనైనంత సహాయం చేస్తాను . నేను అతలవితలాది , అదో ఊర్ధ్వ ఏడేడు పదునాలుగు లోకములను బాగుగా ఎరుగుదును . దేవాసురుల సంగ్రామము , క్షీరసాగర మధనము , నాకు తెలుసును . చక్కని రూపము కలిగిన ఒక స్త్రీ ని  రావణుడు అపహరించి పోవుచుండగా నేను చూసితిని ఆమె బిగ్గరగా రామా లక్స్మనా , అని అరుచుచుండెను ఆమె శరీరమంతా వణికిపోవుచున్నది బహుశా ఆమె సీతాదేవి అయిఉండవచ్చూ  ఓ వనరులారా , ఆ రాక్షసుని పేరు రావణుడు అతడు విశ్ర వాసుని ఔరస పుత్రుడు కుభేరుని సోదరుడు లాకా నగరం అతని నివాసము , ఇక్కడికి వంద యోజనముల దూరమున సముద్ర మధ్యముగా ఒక ద్వీపము కలదు . విశ్వకర్మ లంకా నగరమును నిర్మించెను సీతాదేవి ఆ లంక యందును , రావణుని అంతఃపురము నందు బంధింపబడి ఉన్నది . రాక్షస స్త్రీ లు ఆమెకు  కాపలా కాయుచున్నారు. ఓ వానరులారా వెంటనే మీ పరాక్రమమును చూపుచూ సముద్రమును లంఘించుటకు త్వరపడుదు మీరు అక్కడ అవశ్యము సీతాదేవిని దర్శించి క్షేమముగా తిరిగిరాగలరు . నా దివ్యదదృష్టి తో చూచి పలుకుచున్న మాటలివి . మిగిలిన పక్షుల కంటే మా జాతి పక్షులు వందయోజనములు , లేదా అంతకంటే దూరము ఎగురగలము . 
"నేను ఆవైనతేయని వంశము వాడిని గనుక ఇక్కడ నుండియే రావణుని , జానకిని స్పష్టముగా చూడగలను మాకును గరుడుని వలే శక్తియు , దివ్యదృష్టి గలదు . నా యెడల దయుంచి నన్ను వరుణునకు నిలయమైన సముద్రతీరమునకు చేరుటకై సహాయపడుటకు మిమ్ము అర్ధించుచున్నాను . అక్కడ నా తమ్ముడగు జటాయువునకు తర్పణములు సమర్పితును. "
అనంతరము మిగుల బలశాలులైన ఆ వానరులు రెక్కలు మాడిపోయిన సంపాతిని  తీరా ప్రదేశమునకు చేర్చిరి 
సంపాతి తన సోదరునికి తర్పణములు అర్పించెను . పిమ్మట వానరులు అతనిని మరల యథాస్థానమునకు చేర్చిరి 
అతని ద్వారా సీతాదేవి సమాచారం తెలుసుకున్నందుకు ఎంతయు సంతోషపడిరి . 

రామాయణము - కిష్కింద కాండ - ఏబదియెనిమిదవ సరిగా సమాప్తం . 

      శశి,

ఎం.ఏ ఎం.ఏ,(తెలుగు ),తెలుగుపండితులు. 

రామాయణము కిష్కిందకాండ -ఏబదియేడవసర్గ

                                         రామాయణము 

                                          కిష్కిందకాండ -ఏబదియేడవసర్గ 

సంపాతి ఆ విధముగా మాట్లాడినప్పటికీ , వానర వీరులకు ఆ గ్రద్ద పై నమ్మకము కుదరలేదు అది తమను భక్షించుతాహీ వచ్చినదని వారు నమ్మిరి ఎలాగో చనిపోవుటకు సిద్దపడ్డాము ఆ చావు ఈ గ్రద్ద రూపములో వఛ్చినదని భావిద్దాము అని వారు సమాధానపడి ఆ గ్రద్దను పర్వతముపైనుండి క్రిందకు దించిరి . అప్పుడు అంగదుడు సంపాతితో సీతారామ లక్ష్మణుల వనవాసము సీతాపహరణము జటాయువు మరణము, జటాయువుకు శ్రీ రాముడు అగ్ని సంస్కారములు చేయటం సుగ్రీవ శ్రీ రాముల మైత్రి వాలి వద సీతాన్వేషణకై సుగ్రీవుని ఆజ్ఞ కార్యము సాధించ లేకపోవుటచె వానరుల ప్రాయోపవేశము మొదలగు వృత్తాన్తములుఅన్నియు సవివరముగా చెప్పెను . 
రామాయణము -కిష్కిందకాండ -ఏబదిఒకటవ సర్గము సమాప్తం . 

శశి 

ఎం.ఏ ఎం.ఏ (తెలుగు),తెలుగు పండితులు . 

                                            రామాయణము 

                                 కిష్కిందకాండ-ఏబదిఆరవసర్గ       

ఆ వానర వీరులందరు కూర్చునివున్న ప్రదేశమునకు సంపాతి అను పేరుగల ఒక గ్రద్దరాజు వచ్చెను . వారందరిని చూసి ," ఆహా  దైవానుగ్రహమువల్ల నాకీరోజు మంచిఆహారము లభించినది . అని అనుకొనెను , ఆ మాటలు విన్న అంగదుడు హనుమంతునితో . "ఓ మారుతి ప్రాయోపవేశమునకు కూర్చున్న మనకు చావు తెచ్చుటకు ఆ సూర్య భక్తుడైన యముడే ఈ వేషమున వఛ్చినట్లున్నాడు  గ్రద్దరాజైన జటాయువు సీతారాదేవిని అడ్డుకొనుటకు చేసిన సహస  కార్యమును  మనము వినే  ఉన్నాము . ఆ జటాయువు శ్రీరామునికి పరమ ఆప్తుడు ఆ జటాయువే మిక్కిలి అదృష్టవంతుడు . అతనికి మనవలె సుగ్రీవుని బాధ లేకుండాపోయినది . దశరధ మహా రాజు స్వర్గస్తుడగుట జటాయువు మరణించుట సీతాపహరణం మొదలైన సంఘటనలన్ని యావత్ వానర జాతి జీవనమునకు ముప్పు తెచ్చ్చిపెట్టాయి అని పలికెను. 

ఆ మాటలు విన్న సంపాతి "ఓ వానర వీరులారా మీరంతా ఎవరు  దండకారణ్యమున నివసించుచున్న నా తమ్ముడైన జటాయువు పేరుని చాలా కాలం తర్వాత మీ నోటివెంట విన్నాను అసలు జటాయువు వధ  ఎలా జరిగింది పరమ ధార్మికుడు పురుషోత్తముడు దశరధుని పుత్రుడు ఐన శ్రీ రామునితో జటాయువునకు స్నేహం ఎలా కుదిరెను దయ చేసి నాకు తెలపండి ఓ వీరులారా నన్ను ఈ పర్వతమునుండి మీ వద్దకు కిందకు దించండి సూర్య రసామికి నా రెక్కలు కాలి  పోయిన కారణమున  నేను ఎగరలేను అని పలికెను .  

 రామాయణం-కిష్కిందకాండ -ఏబదిఆరవసర్గ 

       శశి ,

ఎం.ఏ ఎం.ఏ ,(తెలుగు),తెలుగుపండితులు . 

రామాయణము కిష్కిందకాండ -ఏబదియైదవసర్గ

                                రామాయణము 

                            కిష్కిందకాండ -ఏబదియైదవసర్గ 

హనుమంతుడి మాటలు విన్న తర్వాత కూడా ధైర్యము రాని అంగదుడు "ఓ వీరా !ఏది న్యాయము ?సుగ్రీవుడు మా తండ్రి బతికి ఉండగానే అతడి సామ్రాజ్యమును ఆక్రమించెను . మా తండ్రి బయటకు రాకుండా గుహకు అడ్డుపెట్టేను . తనకు రాజ్యము అప్పగించిన శ్రీరాముని కార్యము కూడా మరచిపోయెను . లక్ష్మణుని కోపమునకు బయపడి మనల్ని ఈ కార్యమునకు నియమించెను . అతడు నన్ను యువరాజుగా ప్రకటించలేదు . ధర్మప్రభువైన ఆ రాముడే నన్ను యువరాజుగా నియమించెను . ఇక కార్యము పూర్తి కాలేదని తెలిసినచో సుగ్రీవుడు నన్ను ప్రాణములతో విడుచుట కల్ల . కావున నేను కిష్కింధకు రాను "అని దర్భాసనము వేసుకుని నిరాహార దీక్షద్వారా ప్రాయోపవేశమునకు కూర్చుండెను . అది చూసిన వానరులు తాము సైతము నిరాహార దీక్షకు కూర్చుండిరి . అలా కూర్చుండిన వారు శ్రీరాముని అరణ్యవాసము ,సీతాపహరణము ,సుగ్రీవుడితో మైత్రి ,వాలి వధ ,లక్ష్మణుని కోపము మొదలగు విషయములు చర్చించుకొనిరి . వాటి కోలాహలం మిన్ను ముట్టెను . 
రామాయణము కిష్కిందకాండ ఏబదియైదవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


రామాయణము కిష్కిందకాండ - ఏబదినాలుగవసర్గ

                                           రామాయణము 

                                            కిష్కిందకాండ - ఏబదినాలుగవసర్గ 

అప్పుడు హనుమంతుడు ఇదంతా గమనించి , అంగదునితో "ఓ అంగదా !నీవు మహా పరాక్రమ శాలి అయిన వాలి పుత్రుడవు పైపెచ్చు గొప్ప వీరుడవు , నీవు పిరికి వాడి లాగా ఇలా మాట్లాడడం తగదు ఒక వేళ నీవు ఆ గుహలోకి వెళ్లి తలదాచుకున్నా ఈ చాపలచిత్తులైన వానరులు నీ తోనే ఉంటారని నమ్మకు వారు ఆకలిదప్పికలతోను , భార్యాబిడ్డల బెంగ తోను , ఉండిరి . నీవు వంటరివైపోతావు . నేను నాలాంటి ఇంకా , సుగ్రీవుడి శ్రేయోభిలాషులు మిత్రులు ఐన వానరవీరులు నీతో రారు . ఆ విధముగా నీవు ఇక్కడ ఉన్న విషయము సుగ్రీవునికి తప్పక తెలియును . లక్ష్మణుడి  బాణములు ఇంద్రుని వజ్రాయుధములకన్నా బయంకరమైనవి . వాటి నుండి తప్పించుకొనుట అసాధ్యము . 
మన కు అప్పగించిన సీతాన్వేషణను పూర్తి చేసే మనము తిరిగి వెల్దాము . సుగ్రీవుడు మనకు ఏ దండన విధించడు . పైపెచ్చు అతడు నీకు పినతండ్రి కూడా కదా . కావున నీవు భయపడవలసిన అవసరము లేదు . నీ తల్లి తార నిన్ను ప్రాణముగా చూసుకొనుచున్నది . ఆమెకు నీవు తప్ప వేరొక సంతానము లేదు . కావున మనము ఉత్సాహమును వీడక కార్యము సఫలము చేసుకొని వెళ్ళుట ఉత్తమము "అని పలికెను . 

రామాయణము కిష్కిందకాండ ఏబదినాలుగవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము కిష్కిందకాండ -ఏబదిమూడవసర్గ

                                     రామాయణము 

                                     కిష్కిందకాండ -ఏబదిమూడవసర్గ 

ఆ తపస్వి మాటలు విని హనుమంతుడు "మాతా  మేమందరం , నిన్ను శరణువేడుచున్నాము వానరరాజైన సుగ్రీవుడు సీతాన్వేషణకు మాకు ఒక నెలరోజుల గడువు మాత్రమే విదించెను ఈ గుహలో ఉండగానే , ఆ గడువు పూర్తి అయ్యింది.  కనుక మా మీద దయ ఉంచి ఈ గుహ నుండి బయటపడే  మార్గము తెలిపి పుణ్యం కట్టుకొనుము . అని బ్రతిమలాడెను . "అప్పుడు ఆ మహా సాత్వి "ఓ వనరులారా ఈ గుహలోకి ప్రవేశించిన వారు బయటపడుట అసాధ్యము కానీ నేను మిమ్ములను బయటకు చేర్చెదను .  అని పలికి వారందరిని బయటకు చేర్చి , ఓ వానరులారా క్షేమముగా వెళ్ళిరండి "అనిపలికెను . 
ఆ భయంకర గుహనుండి బయట పడిన వానరులు , ఒక మహా సముద్రము ఒడ్డుకు చేరిరి . ఆ సముద్రము పెద్ద పెద్ద అలలతో భయంకరంగా ఉండిని



. అప్పుడు యువరాజైన అంగదుడు 

" ఓ  వానర వీరులారా !సుగ్రీవుడు విధించిన గడువు పూర్తిఅయిపోయింది ఆయన ఆజ్ఞను మీరినమనకు చావు తప్పదు అక్కడికి వెళ్లి చచ్చుటకంటె ఇక్కడే ప్రాయోపవేశము చేయుట ఉత్తమము . కనుక నేను ఈ సముద్ర తీరమునందే ప్రాయోపవేశము చేయుదును అని పలికెను ". 

అప్పుడు తారుడు అను వానరవీరుడు "మనము మరణించుటకంటె ఆ బిలముతో ఫల కంద మూలాదులను , తింటూ హాయిగా జీవించుట ఉత్తమము అక్కడ మనకు దేవేంద్రుడి వలన కూడా అపాయము సంభవించదు" అని పలికెను . ఆ పలుకులకు , అంగదుడు సైతము అంగీకరించినట్లు అనిపించెను . 

రామాయణము - కిష్కిందకాండ _ఏబదిమూడవసర్గ . 

         శశి , 

ఎం.ఏ,ఎం. ఏ ,(తెలుగు),తెలుగు పండితులు .