రామాయణము
కిష్కిందకాండ -ఏబదియేడవసర్గ
సంపాతి ఆ విధముగా మాట్లాడినప్పటికీ , వానర వీరులకు ఆ గ్రద్ద పై నమ్మకము కుదరలేదు అది తమను భక్షించుతాహీ వచ్చినదని వారు నమ్మిరి ఎలాగో చనిపోవుటకు సిద్దపడ్డాము ఆ చావు ఈ గ్రద్ద రూపములో వఛ్చినదని భావిద్దాము అని వారు సమాధానపడి ఆ గ్రద్దను పర్వతముపైనుండి క్రిందకు దించిరి . అప్పుడు అంగదుడు సంపాతితో సీతారామ లక్ష్మణుల వనవాసము సీతాపహరణము జటాయువు మరణము, జటాయువుకు శ్రీ రాముడు అగ్ని సంస్కారములు చేయటం సుగ్రీవ శ్రీ రాముల మైత్రి వాలి వద సీతాన్వేషణకై సుగ్రీవుని ఆజ్ఞ కార్యము సాధించ లేకపోవుటచె వానరుల ప్రాయోపవేశము మొదలగు వృత్తాన్తములుఅన్నియు సవివరముగా చెప్పెను .
రామాయణము -కిష్కిందకాండ -ఏబదిఒకటవ సర్గము సమాప్తం .
శశి
ఎం.ఏ ఎం.ఏ (తెలుగు),తెలుగు పండితులు .
No comments:
Post a Comment