Sunday 17 September 2017

రామాయణము కిష్కిందకాండ -రెండవసర్గ

                                        రామాయణము 

                                         కిష్కిందకాండ -రెండవసర్గ 

చక్కని బలిష్టమైన రూపము ,శ్రేష్టమైన ఆయుధములు ధరించిన రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు ,అతడితో వున్న మిగిలిన వానరులు మిక్కిలి బయపడసాగిరి . ఏమిచేయాలో ఆలోచించసాగిరి . సుగ్రీవుడు మాత్రము మిక్కిలి బయపడసాగెను అతడు తన మంత్రులతో "వీరు జింకచర్మము ధరించి సన్యాసుల వలేవున్నానూ ,వీరు శ్రేష్టమైన ఆయుధములను ధరించివున్నారు . కావున వీరిని తప్పకుండా వాలి పంపి ఉంటాడు . మనలను పరిమార్చుటకే వీరు ఇచటికి వచ్చివుంటారు . "అని పలికెను 

అప్పుడు ఆంజినేయుడు సుగ్రీవునికి ధైర్యము చెప్పి "వారు వాలి అనుచరులు అయివుండరు . వాలికి కల శాప కారణముగా ఈ పర్వతము మీదకు వచ్చుటకు ధైర్యము చెయ్యడు కావున నీవు భయపడవలిసిన అవసరము లేదు "అని పలికెను . అయినను సుగ్రీవునికి నమ్మకము కుదరక ఆంజినేయుడిని "వారి వద్దకు మారు వేషములో వెళ్లి వారితో తగిన విధముగా మాట్లాడి ,వారిని బాగుగా పొగిడి వారి నుండి విషయము రాబట్టుము "అని పలికెను . 
ఆవిధముగా సుగ్రీవుడు ఆంజినేయుడిని ఆజ్ఞాపించుటచే ఆంజినేయుడు రామలక్ష్మణుల వద్దకు మారు వేషములో వెళ్ళుటకు సంసిద్ధుడయ్యెను . 

రామాయణము కిష్కిందకాండ రెండవసర్గ సమాప్తము . 

                              శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 






No comments:

Post a Comment