రామాయణము
అరణ్యకాండ -డబ్బదియవసర్గ
తన చేతులలో చిక్కుకున్న రామలక్ష్మణులను చూసి కబంధుడు ఓ క్షత్రియ శ్రేష్ఠులారా !నా ఆకలి సమయములో బాగుగా దొరికినారు . నాకు మిమ్ములను ఆహారముగా ఆ దేవుడే పంపినాడు . "అని పలికెను . ఆ మాటలు విన్న రామలక్ష్మణులు ఆ రాక్షసుడి భుజములను నరికివేసిరి . శ్రీరాముడు కుడి చేతిని లక్ష్మణుడు ఎడమ చేతిని నరికివేసినారు . అప్పుడా రాక్షసుడు భూమ్యాకాశములు ,దశదిశలు పిక్కటిల్లేలా అరుస్తూ నేలపై పడిపోయెను .
అపుడా రాక్షసుడు ఆ రఘువీరులను చూసి 'మీరెవరని ప్రశ్నించెను . అప్పుడు లక్ష్మణుడు "ఈయన రఘువంశతిలకుఁడైన శ్రీరాముడు నేను ఈయన తమ్ముడు లక్ష్మణుడను .ఈ రామచంద్రుని భార్య ను ఒక రక్కసుడు అపహరించుటచే ఆమెను వెతుకుచూ ఇలా వచ్చితిమి . నీవెవరు ? కంఠము ,ముఖము లేక ఇటుల వికృతముగా ఎందులకు ఉంటివి ?"అని ప్రశ్నించగా ఆ రాక్షసుడు తన గాధను జ్ఞప్తికి తెచ్చుకుని వారికి తన కథను చెప్పసాగెను .
రామాయణము అరణ్యకాండ డబ్బదియవసర్గ సర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment