Saturday 16 September 2017

రామాయణము కిష్కింధాకాండ -మొదటిసర్గము

                               రామాయణము 

                                కిష్కింధాకాండ -మొదటిసర్గము 

ఆ మనోహరములైన ప్రదేశములను చూచుచు రామలక్ష్మణులు ముందుకు నడుచుచుండిరి . ఆ ప్రదేశములు చూసి రాముడు సీతను గుర్తుతెచ్చుకుని మిక్కిలి వ్యాకులపడసాగెను . "లక్ష్మణా !నాకు సీత కనిపించినచో నేను సీతతో కలిసి ఇచటనే ఉండేదను . నాకు అమరసుఖములు కానీ అయోధ్యాధిపత్యము కానీ వద్దు . జానకి దొరికిన చాలు . అచట భరతుడు నాకోసము నందీ గ్రామములో ఉపవాసదీక్షలో భరతుడు బాధపడుతున్నాడు . రాక్షసుడి చే అపహరించబడి సీత ఎంత బాధపడుతున్నదో ,వారిరువురు అలా బాధపడుతుండగా నాకు ఈ రమ్యమైన ప్రకృతి ఏమాత్రము సంతోషమును కలిగించుటలేదు . 

పుణ్యాత్ముడైన జనకమహారాజు సీత క్షేమసమాచారమును ప్రశ్నించినచో నేనేమి సమాధానము చెప్పగలను . నా మీద కల ప్రేమతో కోరి ఈ వనములకు వచ్చి కష్టములు తెచ్చుకున్నది . కానీ నేను ఆమెను రక్షించలేకపోవుచున్నాను . "అని బాధతో మాట్లాడుతున్న రాముడితో లక్ష్మణుడు "అన్నా !బాధించకు వదిన తప్పక లభించును . ఆ రావణుడు పాతాళములో దాగివున్నను మన చేతిలో చావు తధ్యము . నీవు ఊరడిల్లుము "అని ఓదార్చెను . వారిరువురు అటుల మాట్లాడుకుంటూ ఋష్యమూక పర్వతము దగ్గరదగ్గరకు వచ్చిరి . వారిని చూసిన సుగ్రీవుడు ,ఇతర వానరులు వాలి పంపగా వచ్చిన వీరులని భావించి భయముతో అచటికి దగ్గరలో ఉన్న మాతంగమహర్షి ఆశ్రమములోకి పరుగిడిరి . 

రామాయణము కిష్కిందకాండ మొదటిసర్గము సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ .ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment