రామాయణము
అరణ్యకాండ -డబ్బదిరెండవసర్గ
రామలక్ష్మణులు కబంధుని మాటలు విన్న తర్వాత ,గిరి సమీపమున గోతిని తవ్వి అందు కబంధుని పడవేసి అతడి దేహమును కట్టెలతో ఎండు ఆకులతో దహనమొనర్చిరి . అతడి దేహము పూర్తిగా దహనమయిన పిమ్మట ఒక దివ్య తేజస్సుతో కూడి దివ్యాభరణములు ,వస్త్రములు ధరించిన ఒక దివ్యపురుషుడు ఆ చితి మంటలనుండి వచ్చెను . అతడు "రామా !నాకు శాప విమోచనము కలిగించినందుకు కుతజ్ఞుడను .
నీకు నీ భార్య సీతాదేవి లభించుటకు ఒక వీరుడితో స్నేహము చేయుట ఉత్తమము అని నా భావన . కిష్కింద అను వానర రాజ్యమునకు వాలి రాజు అతడు వానరుడు . అతడు ఇంద్రుని అంశతో జన్మించాడు . అతడి తమ్ముడు కారణాంతరముల వలన అతడి అన్న గారిచే రాజ్యము నుండి వెడలగొట్టబడి ఋశ్యమూకం అను పర్వతముపై నలుగురు వానరులతో కలిసి జీవించుచున్నాడు . అతడికి ఈ భూమి మీద తెలియని ప్రదేశము లేదు . సూర్యుడి కాంతి పడు యావత్ భూమి అతడికి తెలుసు .
అతడు సీతాదేవిని అన్వేషించుటలో నీకు తప్పక తోడ్పడగలడు . అతడికి నీవు చేయవలసిన సహాయము ఒకటి కలదు ఆ పని నీ వలన అయినను అవకపోయినను అతడు నీకు సహాయపడగలడు . అతడు వానరుడని చులకనగా చూడకు . సీతను ఎత్తుకెళ్లిన రాక్షసుడు ఆమెను మీరు పర్వతముపై దాచినను ,పాతాళములో దాచినాను వాడిని చంపి ఆమెను నీకు అప్పగించగల సమర్థుడు . కావున నీవు అతడితో మైత్రి ఏర్పరుచుకొనుము . "అని పలికెను .
No comments:
Post a Comment