Sunday, 12 February 2017

                                            రామాయణము 

                                   అయోధ్యకాండ -తొంబది తొమ్మిదవసర్గ 

భరతుడు అన్నయైన శ్రీరాముని దర్శించవలెననే  కోరికతో శత్రుఘ్నుడికి ఆశ్రమ చిహ్నములు చూపిస్తూ దానిని సమీపించెను . వశిష్ట మహర్షికి తన తల్లులను జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పి ,తానూ వడివడిగా నడవసాగెను . ఆయనతో పాటు ,శత్రుఘ్నుడు ,సుమంత్రుడు ,గుహుడు నడవసాగిరి . భారద్వాజమహర్షి చెప్పిన గుర్తులను గుర్తుకు తెచ్చుకుంటూ ,ఆ దారిలో నడవసాగెను . దారిలో రామలక్ష్మణులు ఏర్పరుచుకున్న గుర్తులు గమనిస్తూ వాటి గురించి శత్రుఘ్నుడికి వివరిస్తూ భరతుడు ముందుకు సాగెను . నడుచునపుడు భరతుడు శత్రుఘ్నుడితో "రాజప్రాసాదములో రాజభోగములు అనుభవించవలిసిన అన్నావదినలు ఈవిధముగా  కష్టపడుటకు నేనే కారణము . కావున నేను వెళ్లిన వెంటనే అన్న పాదములపై పడి క్షమించమని వేసుకుంటాను . "
అని పలికెను . ఆ విధముగా మాట్లాడుకుంటూ రాముని ఆశ్రమమును సమీపించిరి . ఆ ఆశ్రమమును ,అచటి పరిసరములను బాగుగా పరిశీలించెను . అచట ఒకానొక ఆసనముపైన నారచీరలు జింక చర్మము ధరించి రాముడు ధ్యాన నిమగ్నుడై ఉండెను . ఆయనను చూడగానే భరతుడు దుఃఖముతో గొంతు పూడిపోగా స్వామీ !అని నెమ్మిదిగా పిలిచెను . పిదప ఆయన స్వరము పెక్కుసేపు దుఃఖముతో పెగలకుండెను . అతి ప్రయత్నమూ మీద అన్నా !అని పిలిచి రాముని పాదములపై పది ఏడవసాగెను . శత్రుఘ్నుడు సైతము రాముని పాదములపై పది ఏడవసాగెను . రాముడు వారిరువురిని లేవనెత్తి తన అక్కునచేర్చుకొనెను . ఆ దృశ్యము చూసిన అచటి వారు ఆశ్రమవాసులు ,సుమంత్రుడు ,గుహుడు ఆనందాశ్రువులు కార్చిరి . 

రామాయణము అయోధ్యకాండ తొంబదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



No comments:

Post a Comment