రామాయణము
అయోధ్యకాండ -నూటమూడవసర్గ
వశిష్ఠుడు దశరధుని పత్నులను వెంట పెట్టుకుని రామాశ్రమము వైవు వేగముగా నడవసాగెను . దారిలో కౌశల్య మిగిలిన దశరధుని పత్నులతో శ్రీరాముని గూర్చి చెబుతూ నడవసాగెను . సుమిత్రతో "ఓ సుమిత్రా !నీ కుమారుడు బహుశా ఈ నది నుండే నా కుమారుడి కొరకు నీటిని తీసుకువెళ్తూ ఉండిఉండవచ్చు సుకుమారమైన లక్ష్మణుడు ఈ అరణ్యములో నా కుమారుడు కొఱకు నానా యాతన పడుచున్నాడు . భరతుడి అభ్యర్ధనను మన్నించి రాముడు అయోధ్యకు వచ్చినచో నీ కుమారుడికి ఈ యాతన తప్పుతుంది . "అని పలుకుతూ సీతారామలక్ష్మణులు తిరుగు ప్రదేశములు చూపుతూ కౌశల్య నడుచుచుండగా ,మిగిలిన దశరధుని పత్నులు సైతము శ్రీరాముని చూడవలెననే కోరికతో వేగముగా నడవసాగిరి .
వారు ఆవిధముగా నడుస్తూ ఎట్టకేలకు శ్రీరాముని ఆశ్రమమునకు చేరిరి . అచట నారచీరలు ,జతలు ధరించి దర్భాసనము మీద కూర్చుని వున్న శ్రీరాముని చూసి కౌశల్య "మహారాజు బిడ్డ ఇటువంటి జీవనము గడపవలసి వచ్చినదే "అని ఏడ్చెను . తల్లులను చూసిన శ్రీరాముడు వారి మువ్వురి పాదములకు నమస్కారములు చేసెను . పిదప లక్ష్మణుడు సైతము వారికి నమస్కారము చేసెను . పిదప సీత కూడా అత్తల పాదములకు నమస్కారము చేసెను . కౌశల్య సీతను హత్తుకొనెను . ఆ విధముగా అందరూ కలుసుకొనిరి . అచట ఆసీనులయ్యిరి .
రామాయణము అయోధ్యకాండ నూటమూడవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment