Friday, 3 February 2017

రామాయణము అయోధ్యకాండ -ఎనుబది తొమ్మిదవసర్గ

                                                    రామాయణము 

                                             అయోధ్యకాండ -ఎనుబది తొమ్మిదవసర్గ 

అన్నను దర్శించవలెననే కోరికతో భరత శత్రుఘ్నులు ప్రాతః కాలమునే మేల్కొనెను . గుహుడు సైతము ప్రాతః కాలమునే వారి చెంతకు వచ్చెను . భరతుడు గుహుని నది దాటుటకు ఏర్పాట్లు చేయమని కోరగా గుహుడు గంగా నదిని దాటుటకు 500 నావలను ,స్వస్తికము (స్వస్తిక్ గుర్తు కలిగినవి )అను పేరు కల కొన్ని నవలను గంగా నదీ తీరమున నిల్పెను . భరతశత్రుఘ్నులు బ్ర్రాహ్మణోత్తములు ,మునులు ముందుగా నావపైకెక్కినారు . పిదప కౌశాల్యసుమిత్రకైకేయిలు నావపైకెక్కిరి . మిగిలిన సైనికులు ,జనములు తాము విశ్రమించిన గుడారములకు నిప్పుపెట్టి (శత్రువులకు తమ జాడ తెలియకుండుట కొరకు నిప్పు పెట్టుట ఆనవాయితి . అటుల చేసిన తమకు విజయము కలుగుతుందని  భావించెడివారు )తమతమ వస్తువులను నావపైకి చేర్చిరి . కొన్ని నావలలో అశ్వములు ,రథములు ,విలువైన ఆభరణములు చేర్చబడినవి . గజములు మావటివాడి అదిలింపులతో నదిని దాటినవి . కొంతమంది సైన్యము గజములమీద కొంతమంది నావలపై తీరము దాటిరి . నావలు వారిని నదిని దాటించి మిగిలిన సైన్యము కొరకు వెనుతిరిగినవి . భరతశత్రుఘ్నులు నది దాటి భారద్వాజ ఆశ్రమం వైపు సాగెను . కొంత  వెళ్లిన పిమ్మట సైన్యమునకు విశ్రాంతి తీసుకోమని ఆదేశము ఇచ్చి వశిష్టాది మునులు ,మంత్రులతో కలసి భరతశత్రుఘ్నులు భరద్వాజాశ్రమమును దర్శించుటకై ముందుకు సాగి చూడముచ్చటగా ఉన్న పర్ణశాలలు ,ప్రకృతితో కూడిన భరద్వాజాశ్రమమునకు చేరిరి . 

రామాయణము అయోధ్యకాండ ఎనుబదితొమ్మిదవసర్గ సమాప్తము . 

               శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







No comments:

Post a Comment