Tuesday, 14 February 2017

రామాయణము అయోధ్యకాండ -నూటయొకటవసర్గ

                             రామాయణము 

                    అయోధ్యకాండ -నూటయొకటవసర్గ 

శ్రీరాముడు పలికిన మాటలు విని భరతుడు  
"అన్నా !నిన్ను సేవించుటే నా పరమ ధర్మము దానికే దూరమైనపుడు నాకు రాజధర్మములతో పని ఏమి ?రాజకుమారులలో పెద్దవాడు ఉండగా కనిష్ఠుడు రాజు కాజాలడు . ఇదియే మన వంశపారంపర్యముగా వస్తున్న ధర్మము . 
ఓ రఘునందనా !జేష్టుడవైన నీవు నాతొ పాటు అయోధ్యకు రమ్ము . వంశప్రతిష్ఠకై కోసల రాజ్యమునకు పట్టాభిషిక్తుడవుకమ్ము . సీతాదేవి ,లక్ష్మణులతో కలసి నీవు అరణ్యవాసమునకు బయలుదేరి రాగానే మహారాజు బాధ తట్టుకొనలేక మరణించెను . నేను కేకేయ రాజ్యమున ఉంటిని . విషయము తెలిసి వస్తిని . 
మన తండ్రి నీ ఎడబాటు కారణముగా నిన్ను గురించి  శోకసంతప్తుడయ్యెను . నిన్ను చూడవలెననే కోరికతో ఆయన తన బుద్ది నుండి నిన్ను మరల్పలేక దుఃఖముతో విలవిలలాడుచూ నిన్నే స్మరించుచు అస్తమించెను

రామాయణము అయోధ్యకాండ నూటయొకటవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ (తెలుగు ), తెలుగు పండితులు . 




No comments:

Post a Comment