రామాయణము
అయోధ్యకాండ -నూటయొకటవసర్గ
శ్రీరాముడు పలికిన మాటలు విని భరతుడు
"అన్నా !నిన్ను సేవించుటే నా పరమ ధర్మము దానికే దూరమైనపుడు నాకు రాజధర్మములతో పని ఏమి ?రాజకుమారులలో పెద్దవాడు ఉండగా కనిష్ఠుడు రాజు కాజాలడు . ఇదియే మన వంశపారంపర్యముగా వస్తున్న ధర్మము .
ఓ రఘునందనా !జేష్టుడవైన నీవు నాతొ పాటు అయోధ్యకు రమ్ము . వంశప్రతిష్ఠకై కోసల రాజ్యమునకు పట్టాభిషిక్తుడవుకమ్ము . సీతాదేవి ,లక్ష్మణులతో కలసి నీవు అరణ్యవాసమునకు బయలుదేరి రాగానే మహారాజు బాధ తట్టుకొనలేక మరణించెను . నేను కేకేయ రాజ్యమున ఉంటిని . విషయము తెలిసి వస్తిని .
మన తండ్రి నీ ఎడబాటు కారణముగా నిన్ను గురించి శోకసంతప్తుడయ్యెను . నిన్ను చూడవలెననే కోరికతో ఆయన తన బుద్ది నుండి నిన్ను మరల్పలేక దుఃఖముతో విలవిలలాడుచూ నిన్నే స్మరించుచు అస్తమించెను .
రామాయణము అయోధ్యకాండ నూటయొకటవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ), తెలుగు పండితులు .
No comments:
Post a Comment